
Hero Electric Scooter: మీరు కొత్తగా స్కూటర్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా..? అయితే మీ కోసం ఓ అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రముఖ వాహన తయారీ కంపెనీ హీరో ఎలక్ట్రిక్ కీలక నిర్ణయం తీసుకుంది. తన స్కూటర్ల ధరలను తగ్గించింది. ఎలక్ట్రిక్ స్కూటర్కు మాత్రమే ఇది వర్తించనుంది.

హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని ఆలోచించే వారికి ఇది మంచి అవకాశమేనని చెప్పాలి. కంపెనీ ఆప్టిమా హెచ్ఎక్స్ స్కూటర్ల ధరలో తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఫేమ్ 2 సబ్సిడీ నిబంధనలు సడలించడం ఇందుకు ప్రధాన కారణం.

ధరల తగ్గింపు నేపథ్యంలో సింగిల్ బ్యాటరీ వేరియంట్ ఇప్పుడు రూ.53,600కు లభిస్తోంది. దీని ధర ఇది వరకు రూ.61,640 ఉండేది. అంతేకాకుండా మీరు కంపెనీ అధికారిక వెబ్సైట్ నుంచి ఈ స్కూటర్ను రూ.2,999 టోకెన్ అమౌంట్తో బుక్ చేసుకోవచ్చు.

ఈ స్కూటల్ గంటకు రూ.42 కిలోమీటర్ల వేగంగా వెళ్తుంది. ఒక్కసారి రీచార్జ్ చేస్తే సుమారు 82 కిలోమీటర్ల దూరం వెళ్లగలదు. బ్యాటరీ ఫుల్ కావాడనికి ఐదు గంటల సమయం పడుతుందని కంపెనీ చెబుతోంది. అంతేకాదు.. ఇందులో డ్యూయెల్ బ్యాటరీ వెర్షన్ కూడా ఉంది. దీని ధర ఇప్పుడు రూ.58,980గా ఉంది. బ్యాటరీని ఒక్కసారి చార్జ్ చేస్తే ఇది 122 కిలోమీటర్లు వెళ్తుంది.