
గోల్డ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్. సోమవారం బంగారం ధరలు పెరిగాయి. వారం ప్రారంభంలోనే ధరలు పెరిగి కొనుగోలు చేసేవారికి షాకిచ్చాయని చెప్పవచ్చు. గతం వారంలో బంగారం ధరలు తగ్గడంతో భారీ ఊరట లభించింది. అయితే ఇప్పుడు పెరగడంతో షాక్ తగిలినట్లయింది. ప్రస్తుతం దేశంలోని వివిధ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం.

హైదరాబాద్లో 10 గ్రామలు 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,59,380 వద్ద కొనసాగుతోండగా.. ఆదివారం రూ.1,59,060గా ఉంది. సోమవారం రూ.320 మేర పెరిగిందని చెప్పవచ్చు. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,100 వద్ద ట్రేడవుతుండగా.. నిన్న రూ.1,45,800గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.300 మేర పెరిగింది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా పై ధరలే ఉన్నాయి.

చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,61,240 వద్ద కొనసాగుతోండగా.. నిన్న రూ.1,60,690గా ఉన్నాయి. నిన్నటితో పోల్చుకుంటే రూ.550 పెరిగాయి. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,47,800 వద్ద ఉండగా.. నిన్న రూ.1,47,300 వద్ద స్ధిరపడ్డాయి. ఇవాళ రూ.500 పెరిగాయని చెప్పవచ్చు. బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.1,59,380గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,46,100గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,59,530గా ఉండగా.. ఆదివారం రూ.1,59,210గా ఉంది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,46,250 వద్ద ఇవాళ కొనసాగుతోంది. అటు వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా ఇటీవల పెరగ్గా.. ఇప్పుడు స్థిరంగా ఉన్నాయి.

ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ.2.85 లక్షల వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ.2.95 లక్షలుగా ఉంది. ఇక బెంగళూరులో కేజీ సిల్వర్ ధర రూ.2.85 లక్షల వద్ద కొనసాగుతోంది.