
గత నెలలో బంగారం ధరలు పడిపోగా.. ఈ నెలలో గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తోన్నాయి. ప్రస్తుతం తులం బంగారం రూ.1.60 లక్షల వద్ద కొనసాగుతోంది. భౌగోళిక పరిస్థితుల, ద్రవ్యోల్బణం గోల్డ్ రేట్లు పెరగడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే రానున్న రోజుల్లో పసిడి ధరలు మరింత పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. త్వరలో మరింత పెరగుతాయని చెబుతున్నారు.

ఇదే పెరుగుదల కొనసాగితే రానున్న కొద్ది రోజుల్లో రూ.53 వేల వరకు ధరలు పెరగొచ్చని అంటున్నారు. దీంతో తులం బంగారం రూ.2 లక్షలకు చేరుకునే అవకాశం లేకపోలేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే ఆల్ టైం రికార్డ్ దిశగా గోల్డ్ రేట్లు చేరుకుని అన్ని రికార్డులను బద్దలు కొట్టనుందని అభిప్రాయపడుతున్నారు. రానున్న 12 నెలల్లో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 6 వేల డాలర్లకు చేరుకోవచ్చంటున్నారు

బంగారం ధరల పెరుగుదలపై సాక్సో బ్యాంక్ కమోడిటీ స్ట్రాటజీ హెడ్ ఓలే హాన్సెన్ కీలక అంచనాలు వేశారు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కె్ట్లో ఔన్సు గోల్డ్ రేటు 4,490 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక భారత బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం రూ.1.60 లక్షల వద్ద గురువారం కొనసాగుతోంది. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో 6 వేల డాలర్లను అధిగమిస్తే.. భారత మార్కెట్లలో కూడా పెరుగుతాయి.

4 వేల డాలర్ల నుంచి 6 వేల డాలర్లకు పెరిగితే 33.6 శాతం ధరలు పెరిగినట్లు అవుతుంది. దీంతో 10 గ్రామలు గోల్డ్ రేటు దేశంలో రూ1.60 లక్షల నుంచి నుంచి రూ.2.12 లక్షలకు చేరుకుంటుంది. అంటే రూ.53 వేల మేర పెరుగుతున్నట్లు అవుతుంది. బంగారం ధరలపై డాలర్ ప్రభావం, దిగుమతి సుంకాలు, జీఎస్టీ వంటివి ఉంటాయి. దీంతో ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు ఉంటాయి.

ఓలే హాన్సెన్ అంచనాల ప్రకారం.. యుద్దాల వల్ల ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థ దెబ్బతింది. దీని వల్ల దేశాలు ఒకదానిపై ఒకటి ఆధారపడటం తగ్గిస్తున్నాయి. దీంతో బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. ఇక ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులు యూఎస్ డాలర్పై ఆధారపడటం తగ్గించాయి. ఇక పశ్చిమాసియాలో భౌగోళిక పరిస్థితుల క్రమంలో సురక్షిత పెట్టుబడుల వైపు ఇన్వెస్టర్లు డబ్బును తరలిస్తు్న్నారు.

Gunashekar