2023, జనవరి నుంచి పలు బ్రాండెడ్ కార్ల ధరలను పెంచనున్నట్టు ప్రకటించాయి. ఈ క్రమంలో ఏయే కంపెనీ కార్ల ధరలు పెరుగుతున్నాయో తెలుసుకుందాం. టాటా మోటార్స్కు చెందిన వివిధ మోడళ్లను బట్టి పెరిగిన ధరలు మారుతూ ఉంటాయి.
మారుతీ సుజుకీ ఇండియా కూడా జనవరి నుంచి కార్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. అయితే ఎంత మేర పెంపుదల ఉంటుందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. వివిధ మోడళ్లను బట్టి ధరల పెరుగుదలలో వ్యత్యాసం ఉంటుంది.
రెనాల్ట్ కూడా వచ్చే జనవరి నుంచి కార్ల రేట్లను కూడా పాక్షింగా పెంచనున్నట్లు తెల్పింది. వస్తువుల ధరల పెరుగుదల, విదేశీ మారకపు ధరలలో హెచ్చుతగ్గులు, ద్రవ్యోల్బణం, ఇతర కారణాల వల్ల కార్ల రేట్లలో మార్పులు సంభవిస్తుంటాయి.
జనవరి నుంచి కార్ల ధరలను 1.7 శాతం పెంచుతున్నట్లు ఆడి ఇండియా ప్రకటించింది.
కియా ఇండియా కూడా వచ్చే నెల నుంచి తమ కంపెనీ కార్ల ధరలను పెంచే ఆలోచనలో ఉంది. అయితే ఎంత మేర పెంచనున్నారనేది మాత్రం వెల్లడించలేదు. వివిధ మోడళ్ల కార్లపై 50,000ల వరకు పెరిగే అవకాశం ఉంది.
జనవరి నుంచి కార్ల ధరలను 5 శాతం పెంచుతున్నట్లు మెర్సిడెస్ బెంజ్ ప్రకటించింది.