
లగ్జరీ వాహనాలను తయారీలో ముందంజలో ఉండే సంస్థ బీఎండబ్ల్యూ. అత్యాధునిక కార్లను భారత్ మార్కెట్లో విడుదల చేస్తూ కస్టమర్లను ఆకర్షించుకుంటోంది. తాజాగా ఈ వాహన సంస్థ నుంచి సరికొత్త కారును భారత్లో విడుదల చేసింది. అదే బీఎండబ్ల్యూ 6 సిరీస్ జీటీ ఫేస్ లిఫ్ట్. దీనీ ఎక్స్షోరూమ్ ధర రూ.67.90 లక్షలు. ఇప్పటికే బుకింగ్స్ కూడా ప్రారంభం అయ్యాయి.

ఈ వాహనం మూడు వేరియంట్లలో లభ్యమవుతుంది. పెట్రోల్ మోడల్ వచ్చేసి బేస్ వేరియంట్. డీజిల్ ఇంజిన్లో రెండు వేరియంట్లు ఉన్నాయి. అవే లగ్జరీ లైన్, ఎం స్పోర్ట్ వేరియంట్లు. వీటి ధర వచ్చేసి వరుసగా రూ.68.90 లక్షలు, అలాగే రూ. 77.90 లక్షలుగా సంస్థ నిర్ణయించింది. టాంజానైట్ మెటాలిక్, ఫైటోనివక్ బ్లూ మెటాలిక్, పేమోంట్ రెడ్ మెటాలిక్, బెర్నియా గ్రే యాంబర్ ఎఫెక్ట్ రంగుల్లో దీనిని సొంతం చేసుకోవచ్చు. ఏప్రిల్ 30 లోపు ఈ కారును బుక్ చేసుకుంటే 1.5 లక్షల ఖరీదు గల బీఎండబ్ల్యూ యాక్సెసిరీస్ లభిస్తాయి. ఇందులో బీఎండబ్ల్యూ డిస్ ప్లే కీ, హెడ్ ఫోన్లు, రియర్ సీట్ ఎంటర్టైన్మెంట్ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి.

ఈ బీఎండబ్ల్యూ 6 సిరీస్ వాహనంలో మూడు ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. 2.0 లీటర్ నాలుగు సిలిండర్ల టర్బోఛార్జెడ్ ఇంజిన్ 5000 ఆర్పీఎం వద్ద 257 బీహెచ్ పీ బ్రేక్ హ హర్స్ పవర్. 1550 ఆర్పీఎం నుంచి 4400 ఆర్పీఎం మధ్య 400 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీని డీజిల్ ఇంజిన్ అయితే 620డీ లగ్జరీ 2.0-లీటర్ ట్విట్ టర్బోఛార్జెడ్ యూనిట్ ను కలిగి ఉండి 188 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 400 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

దీని టాప్ స్పెక్ 3.0 లీటర్ డీజిల్ ట్విట్ టర్బో ఛార్జెడ్ యూనిట్ను కలిగి ఉండి 236 బీహెచ్ ప్రీ బ్రేక్ హార్స్ పవర్ 620 ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. 8 స్పీడ్ స్టెప్ ట్రోనిక్ ఆటోమెటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పని చేస్తుంది. ఈ కారులో అద్భుతమైన ఫీచర్స్ను జోడించి భారత్ మార్కెట్లో విడుదల చేసింది బీఎండబ్ల్యూ.