
గోవా: ఇది ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటం, రద్దీ తక్కువగా ఉండటంతో మార్చి నెల సందర్శనకు అనువైన సమయం. మీరు గోవాలో అందమైన బీచ్లు, వాటర్ స్పోర్ట్స్ , నైట్ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు.

హంపి, కర్ణాటక: హంపి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. ప్రసిద్ధ బ్యాక్ప్యాకర్ గమ్యస్థానం. ఇది పురాతన శిధిలాలు, దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది. ఇది భారతదేశం గొప్ప చరిత్ర, సంస్కృతి సంగ్రహావలోకనం అందిస్తుంది.

జైపూర్, రాజస్థాన్: "పింక్ సిటీ"గా పిలువబడే జైపూర్ అనేక చారిత్రాత్మక కోటలు, రాజభవనాలతో సజీవమైన, రంగుల నగరం. మార్చిలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది సందర్శనకు సరైన సమయం.

Varanasi:ఉత్తర ప్రదేశ్లో గంగా నది ఒడ్డున ఉన్న వారణాసి భారతదేశంలోని అత్యంత మతపరమైన ప్రదేశాలలో ఒకటి. దీనిని కాశీ లేదా బనారస్ అని కూడా అంటారు. ఈ పురాతన నగరం హిందువులకు అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటి. ఒంటరి మహిళలు ఇక్కడ సాయంత్రం గంగా హారతితో పాటు, ప్రపంచ ప్రసిద్ధి చెందిన కాశీ విశ్వనాథ దేవాలయం, రుచికరమైన ఆహారం, బోటింగ్ ఆనందించవచ్చు.

రిషికేశ్, ఉత్తరాఖండ్: రిషికేశ్ ఒక ఆధ్యాత్మిక కేంద్రం. యోగా, ధ్యానానికి ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటి. ఇది గంగా నది ఒడ్డున ఉంది. చుట్టూ అందమైన కొండలు, అడవులు ఉన్నాయి.