పెరుగు శరీర ఆరోగ్యానికే కాదు చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ మృత చర్మ కణాలను తొలగిస్తుంది. చర్మానికి సహజమైన మెరుపును తెస్తుంది. నిస్తేజాన్ని తిప్పికొడుతుంది. నల్ల మచ్చలను తొలగిస్తుంది.
పెరుగులో ఉండే జింక్ నల్ల మచ్చలను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడుతుంది. పెరుగులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మొటిమలను నివారించడంలో కూడా సహాయపడతాయి. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మంపై ముడుతలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది.
ఒక టీస్పూన్ కాఫీ పౌడర్లో చిటికెడు పసుపు, ఒక టీస్పూన్ పెరుగు కలిపి రాసుకుంటే ముఖంపై ఉన్న బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ ప్యాక్ ముఖంపై ఉన్న బ్లాక్ హెడ్స్ ను పోగొట్టడానికి సహాయపడుతుంది.
రెండు టీస్పూన్ల పెరుగులో ఒక టీస్పూన్ తేనె, నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించాలి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో మీ ముఖాన్ని కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ముఖంపై ఉన్న నల్ల మచ్చలు తొలగిపోతాయి.
రెండు టీస్పూన్ల ఓట్ మీల్ పౌడర్లో ఒక టీస్పూన్ పెరుగు, రోజ్ వాటర్ వేసి బాగా కలిపి దీన్ని మీ ముఖానికి అప్లై చేసి10 నుంచి 15 నిమిషాలు వదిలేయండి.. ఆరిన తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. ఓట్స్ కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి, చర్మపు రంగును మెరుగుపరచడంలో సహాయపడతాయి.