Ayurveda Tips: చేదుగా ఉంటాయని నిర్లక్ష్యం చేస్తున్నారా.. వేప పండుని తినడం వలన కలిగే ఆరోగ్యప్రయోజనాలు తెలిస్తే వదలరుగా

|

Feb 08, 2024 | 7:05 PM

హిందూ సంప్రదాయంలో వేప మొక్కకు విశిష్ట స్థానం ఉంది. దైవముగా భావించి పూజిస్తారు. ఈ వేప చెట్టు బెరడు, ఆకుల్లో మాత్రమే అన్ని భాగాలు కూడా అనేక వ్యాధులను నయం చేయడానికి ఆయుర్వేదంలో వినియోగిస్తారు. వేపాకుల్లో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఎక్కువమందికి తెలిసిందే.. అయితే వేప పండ్లు కూడా ఔషదాల గనే.. ఈ వేప పండ్ల వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. చేదుగా ఉన్నాసరే ఈ పండ్లను తినడం వలన అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రోజు అవి ఏమిటో తెలుసుకుందాం..   

1 / 6
ప్రస్తుతం మారిన ఆహారపు అలవాట్లతో జీర్ణాశయం, ఫైల్స్, పేగుల్లో పురుగులు వంటి  సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. పైల్స్ తో ఇబ్బంది పడుతుంటే.. ప్రతి రోజూ ప‌ర‌గ‌డుపున నాలుగైదు వేప పండ్ల‌ను తినడం వలన ఫైల్స్ నుంచి విముక్తి లభిస్తుంది.   అంతేకాదు రోజూ ఉదయం, సాయంత్రం రెండు , మూడు వేప పండ్లు తినడం వలన జీర్ణాశయ సంబంధ సమస్యలు తొలగిపోతాయి.photo courtesy: Shutterstock

ప్రస్తుతం మారిన ఆహారపు అలవాట్లతో జీర్ణాశయం, ఫైల్స్, పేగుల్లో పురుగులు వంటి  సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. పైల్స్ తో ఇబ్బంది పడుతుంటే.. ప్రతి రోజూ ప‌ర‌గ‌డుపున నాలుగైదు వేప పండ్ల‌ను తినడం వలన ఫైల్స్ నుంచి విముక్తి లభిస్తుంది.   అంతేకాదు రోజూ ఉదయం, సాయంత్రం రెండు , మూడు వేప పండ్లు తినడం వలన జీర్ణాశయ సంబంధ సమస్యలు తొలగిపోతాయి.photo courtesy: Shutterstock

2 / 6
మధుమేహంతో ఇబ్బంది పడుతున్నవారు రోజూ వేప పండ్లను తినడం వలన చక్కెర స్తాయి అదుపులో ఉంటుంది. photo courtesy: Shutterstock

మధుమేహంతో ఇబ్బంది పడుతున్నవారు రోజూ వేప పండ్లను తినడం వలన చక్కెర స్తాయి అదుపులో ఉంటుంది. photo courtesy: Shutterstock

3 / 6

వేప పండ్లను తినడం వలన కంటి సమస్యలతో పాటు కంటి చూపు కూడా మెరుగు పడుతుంది. అంతేకాదు ముక్కు నుంచి రక్త స్రావం అవుతుంటే.. అదుపులోకి వస్తుంది.photo courtesy: Shutterstock

వేప పండ్లను తినడం వలన కంటి సమస్యలతో పాటు కంటి చూపు కూడా మెరుగు పడుతుంది. అంతేకాదు ముక్కు నుంచి రక్త స్రావం అవుతుంటే.. అదుపులోకి వస్తుంది.photo courtesy: Shutterstock

4 / 6
వేప పండ్ల‌లో యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ మైక్రోబియ‌ల్ గుణాలు ఉంటాయి. కనుక ఇన్‌ఫెక్ష‌న్ తో ఇబ్బంది పడుతున్నా.. మూత్రాశయ సమస్యలున్నా రోజూ రెండు పూట్లా వేప పండ్లను తినడం వలన సమస్య తగ్గుతుంది. photo courtesy: Shutterstock

వేప పండ్ల‌లో యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ మైక్రోబియ‌ల్ గుణాలు ఉంటాయి. కనుక ఇన్‌ఫెక్ష‌న్ తో ఇబ్బంది పడుతున్నా.. మూత్రాశయ సమస్యలున్నా రోజూ రెండు పూట్లా వేప పండ్లను తినడం వలన సమస్య తగ్గుతుంది. photo courtesy: Shutterstock

5 / 6
అంతేకాదు కాలిన గాయాలు, పుండ్లుకు ఈ వేప పండ్ల గుజ్జుని తీసి అప్లై చేస్తే అవి త్వరగా నయం అవుతాయి.  ముఖంపై మచ్చలు, మొటిమలు ఉంటె ఈ గుజ్జు రాసి.. కొంత ఉంచుకుని తర్వాత కడిగేయ్యడం వలన  ముఖం కాంతివంతంగా మారుతుంది. photo courtesy: Shutterstock

అంతేకాదు కాలిన గాయాలు, పుండ్లుకు ఈ వేప పండ్ల గుజ్జుని తీసి అప్లై చేస్తే అవి త్వరగా నయం అవుతాయి.  ముఖంపై మచ్చలు, మొటిమలు ఉంటె ఈ గుజ్జు రాసి.. కొంత ఉంచుకుని తర్వాత కడిగేయ్యడం వలన  ముఖం కాంతివంతంగా మారుతుంది. photo courtesy: Shutterstock

6 / 6
రోజూ వేప పండ్ల‌ను తినడం వలన శ‌రీరంలోని వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు వెళ్లి.. శ‌రీరం అంత‌ర్గ‌తంగా శుభ్రంగా మారుతుంది. క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి. ఇలా చేదు అని లెక్క చెయ్యని వేప పండ్లని తినడం వలన అనేక లాభాలున్నాయి. photo courtesy: Shutterstock

రోజూ వేప పండ్ల‌ను తినడం వలన శ‌రీరంలోని వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు వెళ్లి.. శ‌రీరం అంత‌ర్గ‌తంగా శుభ్రంగా మారుతుంది. క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి. ఇలా చేదు అని లెక్క చెయ్యని వేప పండ్లని తినడం వలన అనేక లాభాలున్నాయి. photo courtesy: Shutterstock