ప్రస్తుతం మారిన ఆహారపు అలవాట్లతో జీర్ణాశయం, ఫైల్స్, పేగుల్లో పురుగులు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. పైల్స్ తో ఇబ్బంది పడుతుంటే.. ప్రతి రోజూ పరగడుపున నాలుగైదు వేప పండ్లను తినడం వలన ఫైల్స్ నుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాదు రోజూ ఉదయం, సాయంత్రం రెండు , మూడు వేప పండ్లు తినడం వలన జీర్ణాశయ సంబంధ సమస్యలు తొలగిపోతాయి.photo courtesy: Shutterstock
మధుమేహంతో ఇబ్బంది పడుతున్నవారు రోజూ వేప పండ్లను తినడం వలన చక్కెర స్తాయి అదుపులో ఉంటుంది. photo courtesy: Shutterstock
వేప పండ్లను తినడం వలన కంటి సమస్యలతో పాటు కంటి చూపు కూడా మెరుగు పడుతుంది. అంతేకాదు ముక్కు నుంచి రక్త స్రావం అవుతుంటే.. అదుపులోకి వస్తుంది.photo courtesy: Shutterstock
వేప పండ్లలో యాంటీ బాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. కనుక ఇన్ఫెక్షన్ తో ఇబ్బంది పడుతున్నా.. మూత్రాశయ సమస్యలున్నా రోజూ రెండు పూట్లా వేప పండ్లను తినడం వలన సమస్య తగ్గుతుంది. photo courtesy: Shutterstock
అంతేకాదు కాలిన గాయాలు, పుండ్లుకు ఈ వేప పండ్ల గుజ్జుని తీసి అప్లై చేస్తే అవి త్వరగా నయం అవుతాయి. ముఖంపై మచ్చలు, మొటిమలు ఉంటె ఈ గుజ్జు రాసి.. కొంత ఉంచుకుని తర్వాత కడిగేయ్యడం వలన ముఖం కాంతివంతంగా మారుతుంది. photo courtesy: Shutterstock
రోజూ వేప పండ్లను తినడం వలన శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లి.. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి. ఇలా చేదు అని లెక్క చెయ్యని వేప పండ్లని తినడం వలన అనేక లాభాలున్నాయి. photo courtesy: Shutterstock