
దీంతోపాటు ఫ్రీ ర్యాడికల్స్ను నాశనం చేస్తాయి. దీని వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు రావు. అలాగే దగ్గు, జలుబు, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఒత్తిడి, ఆందోళన నుంచి బయట పడవచ్చు. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు.

కొందరు ఆపిల్స్ను తొక్క తీసి లోపల ఉన్న విత్తనాలను తొలగించి తింటారు. కానీ కొంతమంది ఆ విత్తనాలను కూడా కలిపి తినేస్తుంటారు. యాపిల్ విత్తనాలు తినడం వల్ల అనేక సమస్యలకు దారితీస్తుందని నిపుణులు చెబుతారు.

ఆపిల్ గింజల్లో సాధారణంగా అమిగ్డాలిన్ అనే విషపూరిత సమ్మేళనం ఉంటుంది. ఆపిల్ గింజలను తిన్నప్పుడు, అమిగ్డాలిన్ శరీరంలో హైడ్రోజన్ సైనైడ్గా మారుతుంది. ఇది శరీరానికి చాలా హానికరం. అందుకే పెద్ద మొత్తంలో ఆపిల్ గింజలను తినకూడదని నిపుణులు చెబుతున్నారు. అమిగ్డాలిన్ ఎక్కువగా ఆపిల్, బాదం, ఆప్రికాట్లు, పీచెస్, చెర్రీస్ మొదలైన పండ్లలో కనిపిస్తుంది.

ఇది శరీర కణాలకు ఆక్సిజన్ చేరకుండా నిరోధిస్తుంది. అంతే కాదు చిన్న మొత్తంలో సైనైడ్ కూడా శరీరానికి స్వల్పకాలిక నష్టాన్ని కలిగిస్తుంది. ఇది తలనొప్పి, గందరగోళం, అలసట, బద్ధకం వంటి సమస్యలకు దారితీస్తుంది. శరీరంలో పెద్ద మొత్తంలో సైనైడ్ చేరితే అధిక రక్తపోటు, స్ట్రోక్, మూర్ఛ వంటి తీవ్రమైన సమస్యలు సంభవించవచ్చు.

యాపిల్ రోజూ తినడం వల్ల శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. పొట్ట కొవ్వు కరుగుతుంది. డయాబెటిస్ రాకుండా యాపిల్ పండ్లు మనల్ని రక్షిస్తాయి. రోజుకు ఒక యాపిల్ను తినడం వల్ల జ్ఞాపకశక్తి సైతం పెరుగుతుంది. దీంతో మెదడు యాక్టివ్గా ఉంటుంది.