
ఆషాడ మాస సారె విశిష్టత: ఆషాడ మాసంలో అమ్మవార్లకు అసలు సారె ఎందుకు సమర్పించాలి. సారె సమర్పిస్తే మంచి జరుగుతుందా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేస్తుంది.

పూర్వం నుండి ఆషాడ మాసంలో అమ్మవార్లను శాకంబరీ దేవిగా అలంకరిస్తారు. వర్షాలు కురిసి, పంటలు పండి, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కృతజ్ఞతా పూర్వకంగా రైతులు పిండి వంటలలు, పండ్లు, స్వీట్లతో అమ్మవారికి సారె సమర్పిస్తారు. ఈ ఏడాది ప్రభుత్వంమే అమ్మవార్లకు ఆషాడ సారె ఆచారాన్ని లాంఛనంగా నిర్వహిస్తుంది.

పూర్వం నుండి ఆషాడ మాసంలో అమ్మవార్లను శాకంబరీ దేవిగా అలంకరిస్తారు. వర్షాలు కురిసి, పంటలు పండి, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కృతజ్ఞతా పూర్వకంగా రైతులు పిండి వంటలలు, పండ్లు, స్వీట్లతో అమ్మవారికి సారె సమర్పిస్తారు. ఈ ఏడాది ప్రభుత్వంమే అమ్మవార్లకు ఆషాడ సారె ఆచారాన్ని లాంఛనంగా నిర్వహిస్తుంది.

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారికి ఆషాడ మాసం సారెను ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సమర్పించారు. ప్రభుత్వం తరఫున దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సతీసమేతంగా మావుళ్ళమ్మ అమ్మవారికి ఆషాడ మాసం సారెను తీసుకువచ్చారు.

వివిధ రకాల పండ్లు, పూలు, స్వీట్లు, పిండివంటలతో మావుళ్ళమ్మ అమ్మవారికి ఘనంగా సారెను అందజేశారు. త్యాగరాజు భవన్ నుండి మావుళ్ళమ్మ గుడి వరకు మహిళలతో కలిసి సారెను తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, ప్రశాంతి, అధికారులు పాల్గొన్నారు.

ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, అమ్మవారికి ఇష్టమైన ఆషాడ మాసంలో రాష్ట్ర ప్రభుత్వం నుండి సారె ను సమర్పించామని మంత్రి కొట్టు సత్యనారాయణ కోరుకున్నారు.

అమ్మవారికి ఇష్టమైన ఆషాడ మాసంలో రైతులు తమ పండించిన పంటలు, పండ్లు, పిండి వంటలతో సారెను సమర్పిస్తారు. ఇది పూర్వం నుండి వస్తున్న ఆచారం.