శ్రీసత్యసాయి జిల్లా, సెప్టెంబర్ 11: శ్రీసత్యసాయి జిల్లాలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఈ బాలిక కంటిలో నుంచి నల్ల చీమలు తీసే కొద్ది వస్తూనే ఉన్నాయి. దీంతో ఈ విషయం కాస్తా స్థానికంగా చర్చణీయాంశంగా నలిచింది.
గతంలో కంటిలో నుంచి ప్లాస్టిక్ పదార్ధాలు, రాళ్ళు రావడం చూశాం గానీ ఈ విద్యార్థిని కంటిలో నుంచి ఏకంగా నల్ల చీమలు వస్తున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం భక్తరహల్లి గ్రామానికి చెందిన నరసయ్య గౌడ్ కుమార్తె కీర్తన కుడి కంటిలో నుంచి నల్ల చీమలు బయటికి వస్తున్నాయని కుటుంబ సభ్యులు కనుగొన్నారు.
కీర్తన కంటిలో నుంచి ఒక్కొక్కటిగా రెప్పపైకి వస్తున్న చీమలను బయటికి తీయడం మొదలుపెట్టారు. కంటికి ఇబ్బంది లేకుండా ముందు జాగ్రత్తగా కుటుంబసభ్యులు మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించి అక్కడ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కీర్తనకు చికిత్సలు అందిస్తున్నారు.
ఈ విద్యార్థిని అమరాపురం పట్టణంలోని ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. ఇలా నల్ల చీమలు కంటిలో నుంచి ఎక్కువగా వస్తుండడంతో తల్లిదండ్రులు, స్థానికులు ఆశ్చర్యంగా చూస్తున్నారు.
గతంలో కంటిలో నుంచి ప్లాస్టిక్ పదార్ధాలు, రాళ్ళు రావడం చూశాం కాని....ఈ చీమలు ఎక్కడ నుంచి వస్తున్నాయని స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.