
భారతీయుల వంటల్లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా వెల్లుల్లికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. నోటి వ్యాధులకు వెల్లుల్లి బాగా పనిచేస్తుంది. షుగర్ వ్యాధి గ్రస్తులకు వెల్లుల్లి దివ్య ఔషధ. మధుమేహగ్రస్తుల రక్తంలో చక్కెరస్థాయిలను నియంత్రిస్తుంది. వెల్లుల్లి మొత్తం శరీరంలోని 22 రాగాల వ్యాధులనుంచి రక్షణ ఇస్తుందని ప్రాచీన కాలం నుంచి ఉన్న నమ్మకం.

అతి ప్రాచీనమైన ఆయుర్వేద గ్రంథాలలో వెల్లుల్లి ప్రస్తావన ఉంది. వెల్లుల్లిలో అనేక పోషకాలు ఉంటాయి. ఔషధ గుణాలు ఉంటాయి. అందువల్ల వెల్లుల్లి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు పొందాలంటే వెల్లుల్లిని ఏ విధంగా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

రోజూ పరగడుపునే రెండు వెల్లుల్లి రెబ్బలను నేరుగా నమిలి తినవచ్చు. పరగడుపున వెల్లుల్లి రసం కూడా తాగవచ్చు. ఇలాగే వెల్లుల్లి రెబ్బలు 4 తీసుకుని వాటిని కాల్చి తినవచ్చు. పెనం మీద కొంచెం నెయ్యి వేసి.. అందులో వెల్లుల్లి వేయించి తినవచ్చు. వెల్లుల్లి కషాయంలా చేసుకుని కూడా తీసుకోవచ్చు. 2 వెల్లుల్లి రెబ్బలు తీసుకుని నీటిలో వేసి మరిగించి ఆ నీటిని రోజుకు 2 సార్లు కప్పులు తాగవచ్చు.

ఇలా వెల్లుల్లిని తీసుకుంటే అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. హైబీపీ నియంత్రణలోకి వస్తుంది. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది.

చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.ముఖ్యంగా వెల్లుల్లి లివర్లి ను ఆరోగ్యంగా ఉంచుతుంది. కనుక లివర్ సమస్యలున్నావారు వెల్లుల్లి తింటే ఎంతో మేలు. వెల్లుల్లిని తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి.

ఇక వెల్లుల్లి తినలేమనుకునేవారికి టాబ్లెట్స్ రూపంలో కూడా మార్కెట్ లో లభిస్తున్నాయి. వైద్య సూచనలను అనుసరించి ఆ టాబ్లెట్స్ ను మోతాదులో తీసుకోవాలి. రోజూ తినే ఆహారంలో వెల్లుల్లిని ఏదొక రూపంలో తీసుకోండి.. ఆరోగ్యంగా జీవించండి.