
పెరుగు, పటిక బెల్లం యాలకుల డ్రింక్ రెసిపీకి కావలసిన పదార్థాలు: రెండు కప్పులు చిక్కటి తాజా పెరుగు, రెండు టేబుల్ స్పూన్స్ పటిక బెల్లం పొడి, పావు టేబుల్ స్పూన్ యాలకుల పొడి , మరిగించిన పాలు, 8 బాదం పప్పులు, 6 జీడిపప్పులు, 6 పిస్తాలు, 4 కుంకుమపువ్వు రేకులు, ఐస్ క్యూబ్స్ ను కూడా తీసుకోవాలి.

పెరుగు, పటిక బెల్లం లస్సీ డ్రింక్ తయారీ విధానం: మీరు 10 బాదం, 10 జీడిపప్పును తీసుకుని మిక్సీ వేసి దీనిలో కొద్దిగా పాలు పోసి పేస్ట్లా చేసుకోవాలి. ఆ తర్వాత ఇదే మిశ్రమంలో కొద్దీ పెరుగు, రెండు టేబుల్ స్పూన్స్ పటిక బెల్లం పొడి, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడిని వేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

పెరుగు, పటిక బెల్లం లస్సీ డ్రింక్ తయారీ విధానం స్టెప్ 1 : మీకు ఇంకా బరకగా అనిపిస్తే మళ్ళీ కొద్దిగా పాలు పోసి ఇంకోసారి మిక్సీ తిప్పుకుంటే . ఈ డ్రింక్ మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టుకుంటే మరింత టేస్టీగా బాగుంటుంది. ఇక ఇప్పుడు దీనిలో అవసరమైతే కుంకుమపువ్వు రేకులు వేసి ఇంకోసారి బాగా కలుపుకోవాలి.

పెరుగు, పటిక బెల్లం లస్సీ డ్రింక్ తయారీ విధానం స్టెప్ 2 : ఇలా తయారు చేసుకున్న డ్రింక్ను ఒక గ్లాస్లో పోసి దీనిలో బాదం, పిస్తా తురుమును కూడా చల్లి తాగడమే. మీరు కూడా మీ ఇంట్లో ఇదే కొలతలతో చేస్తే అదిరిపోతోంది. ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తాగుతారు. దీనిలో వేసే యాలకుల పొడి మంచి ఫ్లేవర్ ను ఇస్తుంది.

పంచదార వాడకుండా పటిక బెల్లం వేస్తారు కాబట్టి మంచి తీపి వస్తుంది. పచ్చి బాలింతలకు పాలు పెరిగేలా చేస్తుందని మన పెద్దలు చెబుతున్నారు. అయితే, తాగే ముందు ఒకసారి వైద్యున్ని సంప్రదించి తినడం మంచిది (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)