
తేనె, ఎర్ర కంది పప్పుతో ఫేస్ ప్యాక్ : ఎర్ర కంది పప్పులో మాయిశ్చరైజర్కు ఉండాల్సిన అన్ని లక్షణాలూ ఉంటాయి. ఇది చర్మాన్ని హైడ్రేటెడ్గా ఉంచడానికి తోడ్పడుతుంది. ఒక స్పూన్ ఎర్ర కంది పప్పు పొడిలో రెండు స్పూన్ల తేనెను వేసి పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి చిక్కటి ప్యాక్లా వేసుకోవాలి. దాదాపు15 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ఆ తర్వాత గోరు వెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఎర్రకందిపప్పుని ఇలా ప్యాక్ వేస్తే త్వరలోనే ముఖంపై మచ్చలు, పిగ్మంటేషన్ మాయమవుతుంది.

ఎర్ర కందిపప్పు, బియ్యప్పిండి, పచ్చిపాలు: ఒక కప్పులో ఎర్ర కందిపప్పు పొడి , బియ్యప్పిండి సమపాలుగా తీసుకోవాలి. ఇందులో పచ్చి పాలువేసి ఫేస్ ప్యాక్ లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని దాదాపు 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా తరచూ చేస్తే చర్మకణాలలో పేరుకుపోయిన మృత కణాలు తొలగిపోయి చర్మం శుభ్రపడుతుంది.

ఎర్ర కందిపప్పు, పాలు, బాదం నూనె: సగం కప్పు ఎర్ర కందిపప్పును రాత్రంతా నాననిచ్చి ఉదయాన్నే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక టీస్పూన్ పచ్చి పాలు, ఒక టీస్పూన్ బాదం నూనె కలిపి పేస్టులా చేసి ముఖానికి అప్లై చేసుకోవాలి. అరగంట తరువాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే ముఖం కాంతివంతంగా మెరవడమే కాదు, మచ్చలు, మొటిమలు కూడా తగ్గుతాయి.

ఎర్ర కందిపప్పు, పాలు, పసుపు, కొబ్బరి నూనె: ఒక కప్పులో ఒక టేబుల్ స్పూన్ ఎర్ర కందిపప్పు పొడి, రెండు టేబుల్ స్పూన్ ల పాలు, చిటికెడు పసుపు, మూడు చుక్కల కొబ్బరి నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చేతి వేళ్లతో ముఖానికి అప్లై చేసుకుంటూ సున్నితంగా మర్దన చేసుకోవాలి. పది నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా రోజు చేస్తే ముఖం తాజాగా ఉంటుంది.

ఎర్ర కందిపప్పు, పచ్చిపాలు: సగం కప్పు ఎర్ర కందిపప్పును రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో పావు కప్పు పచ్చిపాలు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని సుమారు 15-20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ ట్యాన్ ని తొలగించి చర్మ రంధ్రాలు తెరచుకొనేలా చేసి ముఖాన్ని మెరిసేలా చేస్తాయి. అలాగే జిడ్డును తొలగించి మొటిమల్ని రాకుండా అడ్డుకుంటుంది.