
ఐసేలు (Aiselu): బంగారు రంగులో మెరిసిపోయే ఐసేలు పండు, తేనె లాంటి తీపి రుచిని కలిగి ఉంటుంది. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఈ పండు, కొండలపై ట్రెకింగ్ చేసే పర్యాటకులకు తక్షణ శక్తినిచ్చే నేచురల్ ఎనర్జీ బూస్టర్ లా పనిచేస్తుంది. ప్రస్తుతం స్థానికులు దీనితో జామ్లు, వైన్ కూడా తయారు చేస్తున్నారు.

చియురి (Chiuri): ఇది హిమాలయాల దిగువ ప్రాంతాలలో పెరిగే చెట్టు. దీని పండు లేత పసుపు రంగులో ఉండి, గుజ్జు చాలా తీపిగా ఉంటుంది. అయితే, దీని అసలు ప్రత్యేకత గింజలలో ఉంది. ఈ గింజల నుండి ఒక రకమైన ఘీ (నెయ్యి) తయారు చేస్తారు. దీనిని వంటల్లో దీపాలు వెలిగించడానికి, చర్మ సంరక్షణకు ఉపయోగిస్తారు. కొన్ని స్థానిక తెగలలో ఈ చెట్టును కూతురి పెళ్లిలో కట్నంగా ఇచ్చే ఆచారం కూడా ఉంది.

చుట్రో (Chutro): ఇది చిన్న ఊదా రంగు బెర్రీ లాంటి పండు. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఆయుర్వేదంలో దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. దీని వేరు, బెరడు నుండి రసౌత్ అనే ఒక రకమైన సారాన్ని తయారు చేస్తారు. ఇది కంటి సమస్యలు, చర్మ వ్యాధుల చికిత్సలో బాగా పనిచేస్తుంది.

కింబు (Kimbu): కొండ వాలులలో పెరిగే ఈ పండ్లు గుత్తులుగా కాస్తాయి. పండే కొద్దీ వీటి రంగు మారుతుంది. పుల్లగా, తీపిగా ఉండే కింబు పండ్లను వేసవిలో ఎక్కువగా ఇష్టపడతారు. దీని రసం గొంతు నొప్పి, జీర్ణక్రియ సమస్యల నివారణలో ఎంతగానో సహాయపడుతుంది.

కాఫల్ (Kaphal): దీనిని అడవి పండ్ల రాజు (King of wild fruits) అని పిలుస్తారు. చిన్నగా, ఎరుపు రంగులో ఉండే ఈ పండు పులుపు, తీపి కలయికతో అద్భుతమైన రుచిని ఇస్తుంది. ఇది అడవుల్లో సహజంగా పెరుగుతుంది. చాలా తక్కువ కాలం మాత్రమే లభిస్తుంది. తలనొప్పి, జ్వరం, జీర్ణ సమస్యల నుండి ఉపశమనం పొందడానికి కాఫల్ పండ్లను ఔషధంగా ఉపయోగిస్తారు. ఈ అడవి పండ్లు కేవలం తినడానికే కాదు, పర్యావరణాన్ని కాపాడుతూ, ఆధునిక ప్రాసెస్డ్ ఫుడ్కు దూరంగా ప్రకృతికి దగ్గరగా జీవించడానికి ఒక అద్భుతమైన మార్గంగా నిలుస్తాయి.