రాఫెల్ వచ్చిన రోజే పాక్ బరితెగింపు
రాఫెల్ యుద్ధ విమానాలు వచ్చిన సంగతి తెలిసి కూడా పాక్ తన కవ్వింపు చర్యలను మాత్రం మరవడం లేదు. నిత్యం సరిహద్దు వెంట కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ కాల్పులకు..
రాఫెల్ యుద్ధ విమానాలు వచ్చిన సంగతి తెలిసి కూడా పాక్ తన కవ్వింపు చర్యలను మాత్రం మరవడం లేదు. నిత్యం సరిహద్దు వెంట కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ కాల్పులకు తెగబడుతోంది. తాజాగా బుధవారం నాడు బారాముల్లాలోని యూరీ సెక్టార్ మీదుగా కాల్పులకు తెగబడింది. మెర్టార్ షెల్స్తో పాటు ఇతర ఆయుధాలతో దాడికి దిగింది. ఈ ఘటనలో ఓ ఆర్మీ జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో వెంటనే జవాన్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తుండగా.. వీరమరణం పొందాడు. అయితే పాక్ కవ్వింపు చర్యలకు గట్టి సమాధానం ఇచ్చినట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది.
Pakistan initiated an Unprovoked Ceasefire Violation (CFV) today afternoon along the LoC in Uri sector, Baramulla by firing mortars & other weapons. One Army porter, who was injured in CFV, succumbed to injuries. Befitting response was given: Chinar Corps, Indian Army
— ANI (@ANI) July 29, 2020
Read More
భారత్ ఒడిలోకి చేరుకున్న రాఫెల్.. రాజ్నాథ్ సింగ్ ఎమన్నారంటే..?