పూంచ్ జిల్లా సరిహద్దుల్లో కాల్పులకు దిగిన పాక్
పాకిస్థాన్ మళ్లీ తన వక్రబుద్దికి పనిచెప్తోంది. మంగళవారం నాడు.. కొత్త మ్యాప్ విడుదల చేసి మరో వివాదానికి తెరలేపిన సంగతి తెలిసిందే. ఈ విషయం అలా ఉండగానే.. మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు..
పాకిస్థాన్ మళ్లీ తన వక్రబుద్దికి పనిచెప్తోంది. మంగళవారం నాడు.. కొత్త మ్యాప్ విడుదల చేసి మరో వివాదానికి తెరలేపిన సంగతి తెలిసిందే. ఈ విషయం అలా ఉండగానే.. మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. పూంచ్ జిల్లాలోని మన్కోటే సెక్టార్ మీదుగా కాల్పులకు తెగబడింది. బుధవారం రాత్రి 7.00 గంటల ప్రాంతంలో చిన్న ఆయుధాలు, మోర్టార్ షెల్స్ ప్రయోగిస్తూ కాల్పులకు దిగింది. ఈ విషయాన్ని భారత ఆర్మీ తెలిపింది. పాక్ కాల్పులకు ధీటుగా ఎదురు సమాధానం ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు.
కాగా, గత కొద్ది రోజులుగా నిత్యం సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులకు దిగుతోంది. ఈ ఘటనలో పలువురు సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు తీవ్రంగా గాయపడుతున్నారు.
J&K: Pakistan initiated unprovoked ceasefire violation by firing with small arms & intense shelling with mortars along LoC in Mankote sector, Poonch district at 1900 hours. Indian Army is retaliating befittingly.
— ANI (@ANI) August 5, 2020
Read More :