తెలంగాణలో గ్రామ పంచాయతీల ఆన్లైన్ ఆడిట్
గ్రామ పంచాయతీలు వినియోగించిన నిధులపై ఆన్లైన్ ఆడిట్ జరగనుంది తెలంగాణ సర్కార్. తొలి విడతలో భాగంగా.. సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఆడిట్ ప్రక్రియ.. అక్టోబరు చివరి వారం వరకూ కొనసాగనుంది. రాష్ట్రంలోని 12,769 పంచాయతీలకుగాను 3,830 పంచాయతీల్లో ఆన్లైన్ ఆడిట్ చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 336 మంది ఆడిటర్లను నియమించారు. 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల కోసం ఆన్లైన్ ఆడిట్ తప్పని సరి అని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్న నేపథ్యంలో.. తెలంగాణ […]

గ్రామ పంచాయతీలు వినియోగించిన నిధులపై ఆన్లైన్ ఆడిట్ జరగనుంది తెలంగాణ సర్కార్. తొలి విడతలో భాగంగా.. సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఆడిట్ ప్రక్రియ.. అక్టోబరు చివరి వారం వరకూ కొనసాగనుంది.
రాష్ట్రంలోని 12,769 పంచాయతీలకుగాను 3,830 పంచాయతీల్లో ఆన్లైన్ ఆడిట్ చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 336 మంది ఆడిటర్లను నియమించారు. 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల కోసం ఆన్లైన్ ఆడిట్ తప్పని సరి అని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్న నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.