బ్రేకింగ్.. గుండెపోటుతో బీజేపీ ఎమ్మెల్యే మృతి
ఒడిషాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే మధన్ మోహన్ దత్తా హఠాన్మరణం చెందారు. ఆయన వయస్సు 62 ఏళ్లు. గత కొద్ది రోజులుగా ఆయన అనేక ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.
ఒడిషాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే మధన్ మోహన్ దత్తా హఠాన్మరణం చెందారు. ఆయన వయస్సు 62 ఏళ్లు. గత కొద్ది రోజులుగా ఆయన అనేక ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే బుధవారం ఉదయం సడన్గా గుండెపోటు రావడంతో ప్రాణాలు విడిచారు. ఆయనుకు ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. ఆయనకు కిడ్నీ సమస్యలు కూడా ఉండటంతో.. నిత్యం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. ఆయన ప్రస్తుతం ఒడిషాలోని బాలాసోర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
కాగా, మధన్ మోహన్ మరణంతో బీజేపీ శ్రేణులు దుఃఖంలో మునిగిపోయాయి. దత్తా మరణం విషయం తెలియడంతో ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ప్రతాప్ సారంగితో సహా పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.