Giriraj Singh : ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధులు సమస్యలు పట్టించుకోకపోతే వెదురు కర్రలతో చితక్కొట్టండి : కేంద్ర మంత్రి

|

Mar 07, 2021 | 2:45 PM

Giriraj Singh : ప్రభుత్వోద్యోగులు, ప్రజా ప్రతినిధులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్. గవర్నమెంట్ ఉద్యోగులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సర్పంచులు ప్రజా సమస్యలపై దృష్టి ఉంచి..

Giriraj Singh : ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధులు సమస్యలు పట్టించుకోకపోతే వెదురు కర్రలతో చితక్కొట్టండి  : కేంద్ర మంత్రి
Follow us on

Giriraj Singh : ప్రభుత్వోద్యోగులు, ప్రజా ప్రతినిధులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్. గవర్నమెంట్ ఉద్యోగులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సర్పంచులు ప్రజా సమస్యలపై దృష్టి ఉంచి పరిష్కరించకపోతే వాళ్లని వెదురు కర్రలతో చితక్కొట్టండి అని పిలుపు నిచ్చారాయన. ప్రజల సొమ్ములతో సర్కారీ గిరీలు వెలగబెడుతోన్న ప్రభుత్వోద్యోగులు, ప్రజా ప్రతినిధులు ముమ్మాటికీ ప్రజలకు జవాబుదారీలుగా ఉండాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన బెగూసరాయ్ ప్రజలకు సూచించారు. బీహార్ లోని బెగూసరాయ్ లో నిర్వహించిన సభలో పాల్గొన్న ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాధికారులు సమస్యలను అస్సలు పట్టించుకోవట్లేదంటూ ప్రజల నుంచి తనకు పెద్దఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని చెప్పిన ఆయన, ఈమేరకు వెల్లడించారు.

ఇంత చిన్న విషయాలకూ నా దాకా రావడం దేనికి? ఎంపీలు, ఎమ్మెల్యేలు, సర్పంచులు, కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, ప్రభుత్వాధికారులంతా ప్రజల కోసం పనిచేయాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు. ఎవరైనా సరే ప్రజల సమస్యలను పట్టించుకోవల్సిందే. . అలా కాని పక్షంలో వెదురు కర్రలు తీసుకొని చితక బాదండి. వారి తలలు పగుల గొట్టండి అంటూ కేంద్రమంత్రి అన్నారు. అప్పటికీ వారు మాట వినకపోతే అప్పుడు తానొస్తానని, ప్రజల వెనక నిలబడతానని గిరిరాజ్ సింగ్ మాటిచ్చారు.

Read also : Pawan :’వైసీపీకి విశాఖ ఉక్కుపై చిత్తశుద్ధి.. ప్రేమ ఉంటే, ఎన్నికల స్టంట్లు మాని, పార్లమెంట్ సాక్షిగా నిరూపించుకోవాలి’