Viral News: అరుదైన ఘటనతో వారి ఆనందం నాలుగు రెట్లు.. 5 లక్షల మందిలో ఒకరికి మాత్రమే ఇలా..

|

Sep 22, 2022 | 3:05 PM

కుని సునాకు నెలలు నిండటంతో సంభాల్‌పూర్‌లోని వీర్‌ సురేందర్‌ సాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రిసెర్చ్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. పురిటి నొప్పులు రావడంతో వైద్యులు ఆమెకు సాధారణ కాన్పు చేశారు.

Viral News: అరుదైన ఘటనతో వారి ఆనందం నాలుగు రెట్లు.. 5 లక్షల మందిలో ఒకరికి మాత్రమే ఇలా..
Newborn Baby Death
Follow us on

Viral News: ఒడిశాలో అరుదైన ఘటన చోటుచేసుకున్నది. సంభాల్‌పూర్‌లోని సోనేపూర్‌కు చెందిన కుని సునా అనే మహిళ ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. కుని సునాకు నెలలు నిండటంతో సంభాల్‌పూర్‌లోని వీర్‌ సురేందర్‌ సాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రిసెర్చ్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. పురిటి నొప్పులు రావడంతో వైద్యులు ఆమెకు సాధారణ కాన్పు చేశారు. ఈ క్రమంలో ఆమె నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో తొలుత కవల పిల్లలు పుట్టారని, వారిద్దరు ఆడపిల్లలని వైద్యులు చెప్పారు. మళ్లీ 2.02 గంటలకు మరో పాపకు జన్మనిచ్చిందని, 2.04 గంటల సమయంలో ఒక బాబు పుట్టాడని తెలిపారు.

కాగా, నలుగురు పిల్లలు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. అయితే వారు కొద్దిగా బరువు తక్కువగా ఉండటంతో స్పెషల్‌ న్యూబార్న్‌ కేర్‌ యూనిట్‌కు ఉంచి చికిత్స అందజేస్తున్నారు. ఇలా ఒకే కాన్పులో నలుగురు పిల్లలు జన్మించడం చాలా అరుదని… 5.12 లక్షల మందిలో ఒకరికి మాత్రమే ఇలా నలుగురు పిల్లలు పుట్టే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. పైగా, అటువంటి సందర్భాలలో డెలివరీ సాధారణంగా చాలా క్లిష్టంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

కానీ, కుని నార్మల్‌ డెలీవరిలోనే నలుగురికి జన్మనిచ్చింది. తమ ఆస్పత్రిలో ఇలా జరగడం ఇదే మొదటిసారిగా వైద్యులు వెల్లడించారు. ఇక, ఒకేసారి నలుగురు పిల్లలుపుట్టడంతో కుని కుటుంబీకుల ఆనందానికి అవధులు లేవు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి