‘ మొఘలే ఆజం ‘ కాలం కాదిది.. ఎవరైనా అలా చేశారో..ఖబర్దార్ !

|

Aug 10, 2019 | 5:16 PM

ఈ మధ్య పెరిగిపోతున్న పరువు హత్యలపై రాజస్థాన్ ప్రభుత్వం కొరడా ఝళిపించింది. కులం కానివారనో, ఆస్తులు, అంతస్థుల తారతమ్యం విపరీతంగా ఉందనో ఓ కొత్త జంటపై దాడి చేసే తలిదండ్రులు, వారి బంధువుల ఆటలు ఇక సాగవంటోంది రాజస్తాన్ ప్రభుత్వం.. ఇలాంటివారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆ రాష్ట్ర పోలీసులు అంటున్నారు. 2019 హానర్ కిల్లింగ్ (ప్రివెన్షన్) బిల్లు పేరిట ప్రభుత్వం తెచ్చిన బిల్లును వారు ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ తాజాగా తమ ట్విటర్ లో ట్వీట్ […]

 మొఘలే ఆజం  కాలం కాదిది.. ఎవరైనా అలా చేశారో..ఖబర్దార్ !
Follow us on

ఈ మధ్య పెరిగిపోతున్న పరువు హత్యలపై రాజస్థాన్ ప్రభుత్వం కొరడా ఝళిపించింది. కులం కానివారనో, ఆస్తులు, అంతస్థుల తారతమ్యం విపరీతంగా ఉందనో ఓ కొత్త జంటపై దాడి చేసే తలిదండ్రులు, వారి బంధువుల ఆటలు ఇక సాగవంటోంది రాజస్తాన్ ప్రభుత్వం.. ఇలాంటివారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆ రాష్ట్ర పోలీసులు అంటున్నారు. 2019 హానర్ కిల్లింగ్ (ప్రివెన్షన్) బిల్లు పేరిట ప్రభుత్వం తెచ్చిన బిల్లును వారు ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ తాజాగా తమ ట్విటర్ లో ట్వీట్ చేశారు. ‘ నాటి హిందీ చిత్రం ‘ మొఘలే ఆజం ‘ శకం కాదిది.. ఆ సినిమాలో దిలీప్ కుమార్, మధుబాలల ‘ ప్రేమాయణాన్ని సమాజం చీదరించుకుంది.. పెద్దలు వారి లవ్ ని నిరాకరించారు. అది నాటి మాట..కానీ ఇప్పుడా పప్పులు చెల్లవు.. పెద్దలను ఎదిరించి ఏ జంట అయినా పెళ్లి చేసుకుంటే.. ఆ జంటమీద దాడులు జరిపేవారికి యావజ్జీవ జైలు శిక్ష, రూ. 5 లక్షల జరిమానా విధిస్తాం ‘ అని ఈ ట్వీట్ లో హెచ్చరించారు. పరువు హత్యలకు పాల్పడేవారికి ఇకపై ఇలాంటి కఠిన శిక్షలు తప్పవు అని పేర్కొన్నారు. లవ్ అన్నది నేరం కాదని కూడా వారు ముక్తాయింపునిచ్చారు. ఈ సరికొత్త వార్నింగ్ బాగా పని చేస్తుందని ఆశిస్తున్నట్టు రాజస్థాన్ పోలీసులు చెబుతున్నారు. మరి పరువు హత్యలను అదుపు చేయడానికి ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటాయా? కొత్త బిల్లులు తెస్తాయా..? చూడాల్సిందే !