PM Modi – Amit Shah: ఆనాడు కుదిరిన దోస్తీ.. నేడు దేశాన్ని ముందుడి నడిపిస్తోన్న జోడీ.. అమిత్ షా, మోడీ దోస్తీపై ఆసక్తికర విషయాలు

|

Oct 22, 2024 | 10:40 AM

అమిత్ షా..బీజేపీ అపర చాణక్యుడి పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అమిత్ షా ప్రధాని మోదీని తొలిసారి ఎక్కడ కలిశారో తెలుసా? వారి ఇద్దరి మధ్య స్నేహం ఎలా బలపడిందో తెలుసా?

PM Modi - Amit Shah: ఆనాడు కుదిరిన దోస్తీ.. నేడు దేశాన్ని ముందుడి నడిపిస్తోన్న జోడీ.. అమిత్ షా, మోడీ దోస్తీపై ఆసక్తికర విషయాలు
Pm Modi Amit Shah
Follow us on

నేడు బీజేపీ అపర చాణక్యుడిగాకేంద్ర హోంమంత్రి అమిత్ షా 60వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ప్రధాని మోడీ అమిత్ షాను ఎలా కలిశారో, వారి స్నేహం ఎలా బలపడిందో తెలుసా?

అమిత్ షా 1964 అక్టోబర్ 22న ముంబైలో జన్మించారు. అతను గుజరాతీ వ్యాపారి కుటుంబానికి చెందినవాడు. షా మెహసానాలో విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత బయోకెమిస్ట్రీ చదవడానికి అహ్మదాబాద్ వచ్చాడు. షా ఇక్కడ నుండి బయోకెమిస్ట్రీలో BSc పూర్తి చేసాడు. అతని వ్యాపారంలో తన తండ్రికి కూడా సహాయం చేశాడు. అహ్మదాబాద్‌లోని సహకార బ్యాంకుల్లో స్టాక్ బ్రోకర్‌గా కూడా పనిచేశాడు.

అది 1995, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో 182 స్థానాలకు గాను 121 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఈ విజయంలో పార్టీ కార్యదర్శి నరేంద్ర మోదీ అవిశ్రాంత కృషికి ప్రతిఫలం లభించింది. సీనియర్ నేత కేశుభాయ్ పటేల్ ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి పదవికి మరో పోటీదారు శంకర్ సింగ్ వాఘేలా ఈ నిర్ణయం నచ్చలేదు. ఎమ్మెల్యేల నుంచి భారీ మద్దతు ఉన్నప్పటికీ సీఎం, ఉప ముఖ్యమంత్రి కాలేకపోయారు. వాఘేలా తిరుగుబాటు చేశారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో బీజేపీ కేంద్ర నాయకత్వం రంగంలోకి దిగింది.

1995లో నరేంద్రమోడీని గుజరాత్‌ నుంచి ఢిల్లీకి రీకాల్‌ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్లిష్ట సమయంలో, పార్టీ హైకమాండ్ నుండి చాలా మంది సహచరుల వరకు అందరూ నరేంద్ర మోడీని విడిచిపెట్టినప్పటికీ, ఒక వ్యక్తి ఎల్లప్పుడూ ఆయనతో ఉన్నారు.. అయనే అమిత్ షా. అక్కడి నుంచి వారి స్నేహం మరింతగా పెరిగింది. సోహ్రాబుద్దీన్ బూటకపు ఎన్‌కౌంటర్ ఆరోపణల కారణంగా 2010లో అమిత్ షా మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. 2010 జూలై 25న సీబీఐ అరెస్టు చేసింది. దాదాపు మూడు నెలల పాటు జైలులో ఉండాల్సి వచ్చింది.  షా జైలుకు వెళ్ళిన తరువాత,  మోదీ అతనిని జైలు నుండి బయటకు తీసుకురావడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో షా కుటుంబానికి మోదీ అండగా నిలిచారు.

జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అమిత్ షా గుజరాత్‌లో అడుగుపెట్టకుండా నిషేధం విధించారు. అయితే ఈ కేసులో అమిత్ షాకు క్లీన్ చిట్ లభించింది. ఈ రెండు ఘటనలు మోదీ, షా మధ్య స్నేహం బంధం బలపడింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి