West Bengal: బెంగాల్‌లో బీజేపీకి షాక్.. పార్టీ వీడనున్న ఐదుగురు ఎమ్మెల్యేలు.. సుప్రియో ట్వీట్‌తో కలకలం!

మాజీ కేంద్ర మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు బాబుల్ సుప్రియో సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడనున్నట్లు ప్రకటించారు.

West Bengal: బెంగాల్‌లో బీజేపీకి షాక్.. పార్టీ వీడనున్న ఐదుగురు ఎమ్మెల్యేలు.. సుప్రియో ట్వీట్‌తో కలకలం!
Tmc Leader Babul Supriyo

Updated on: Dec 27, 2021 | 7:13 AM

TMC Leader Babul Supriyo: మాజీ కేంద్ర మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు బాబుల్ సుప్రియో సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడనున్నట్లు ప్రకటించారు. త్వరలోనే వారంతా టీఎంసీలో చేరనున్నట్లు వెల్లడించారు. వాట్సాప్ గ్రూప్‌ను విడిచిపెట్టిన ఐదుగురు అసంతృప్తి ఎమ్మెల్యేలు ఇప్పుడు పార్టీతో విడిపోయే అవకాశం ఉందంటూ ఆదివారం మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు బెంగాల్‌లో కలకలం రేపుతున్నాయి. సుప్రియో బీజేపీకి రాజీనామా చేసి, మూడు నెలల క్రితం తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే.

అయితే, ఐదుగురు ఎమ్మెల్యేలలో ఒకరైన అంబికా రాయ్ ఆదివారం వాట్సాప్ గ్రూప్‌లో మళ్లీ చేరాలని తన కోరికను వ్యక్తం చేశారు. తాను తప్పు చేశానని “బిజెపికి నమ్మకమైన సైనికుడిగా” ఉండాలని కోరుకుంటున్నాను. అంటూ వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే, సుప్రియో మాత్రం బెంగాలీలో ట్వీట్ చేస్తూ.. ‘బీజేపీలో ఒకదాని తర్వాత ఒకటి వికెట్లు పడిపోతున్నాయి. ఈరోజు మరో ఐదుగురు మిగిలారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ ప్రచారాన్ని పర్యవేక్షించిన జాతీయ ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్ ఈపాటికి కైలాస పర్వతానికి వెళ్లి ఉండేవారు. మిమ్మల్ని వెనుక నుంచి లాగే బెంగాలీ పీతలు దొరకాలంటే, మురళీధర్ లేన్ కి వెళ్లండి.’ అంటూ సుప్రియో కామెంట్ చేశారు.


ఇదిలావుంటే, రాజకీయంగా శక్తిమంతమైన మతువా కమ్యూనిటీ ముకుత్మోని అధికారి (రాణాఘాట్ సౌత్), సుబ్రతా ఠాకూర్ (గయాఘట), అంబికా రాయ్ (కళ్యాణి), అశోక్ కీర్తనియా (బొంగావ్ నార్త్), అసీమ్ సర్కార్ (హరింగట్ట) నుండి ఐదుగురు అసంతృప్తి ఎమ్మెల్యేలు పశ్చిమ బెంగాల్ యూనిట్ ఏర్పాటు చేసిన వివిధ పార్టీలలో చేరారు. బీజేపీ.. కమిటీల నుంచి తొలగించిన తర్వాత బీజేపీ ఎమ్మెల్యేల వాట్సాప్ గ్రూప్‌ను వదిలేశారు. మరోవైపు, ఐదుగురు ఎమ్మెల్యేల్లో ఎవరినీ తొలగించబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ అన్నారు. కొత్త కమిటీల్లో వారిని చేర్చుకుంటాం. వారు కొంచెం ఓపిక పట్టవలసి ఉంటుందని ఆయన తెలిపారు.

Read Also…Train Fire Breaks: కాస్‌గంజ్‌ ప్యాసింజర్‌ రైలులో మంటలు.. మూడు బోగీలు అగ్నికి ఆహుతి..! 

Loading...
Unable to load recommendations.
Follow Us