అమర జవాన్ల కుటుంబాలకు రూ. 5లక్షల పరిహారం.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

ఈ నెల 15న గాల్వన్ వ్యాలీలో చైనా సైనికులతో  జరిగిన ఘర్షణల్లో మరణించిన సైనికుల్లో తమ రాష్ట్రానికి చెందిన ఇద్దరు జవాన్ల కుటుంబాలకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రూ.. 5 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. అలాగే వారి కుటుంబాల్లో ఒకరికి..

అమర జవాన్ల కుటుంబాలకు రూ. 5లక్షల పరిహారం.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

Edited By:

Updated on: Jun 17, 2020 | 8:03 PM

ఈ నెల 15న గాల్వన్ వ్యాలీలో చైనా సైనికులతో  జరిగిన ఘర్షణల్లో మరణించిన సైనికుల్లో తమ రాష్ట్రానికి చెందిన ఇద్దరు జవాన్ల కుటుంబాలకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రూ.. 5 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. అలాగే వారి కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ఆమె  ట్వీట్ చేశారు. జవాన్ల త్యాగానికి వెలకట్టలేమన్నారు. అమరులైన సైనికుల్లో ఈ రాష్ట్రానికి చెందిన సిపాయ్  రాజేష్ ఒరాంగ్, బిపుల్ రాయ్ ఉన్నారు. గాల్వన్ లోయలో ఇండో-చైనా సైనిక దళాల ఘర్షణలో ఇరవై మంది భారత సైనికులు మరణించగా.. తమవైపున ముప్పయ్ మంది మృతి చెందినట్టు చైనా అంగీకరించింది. అయితే పరిస్థితిని మరింత విషమించకుండా చూస్తామని ఉభయ దేశాల విదేశాంగ మంత్రులూ తమ ఫోన్ సంభాషణలో  స్పష్టం చేశారు.

 

 

Follow Us