తమిళనాడులోని మహాబలిపురంలో టూరిస్ట్లు రెచ్చిపోయారు. ఓ వాలంటీర్ను ఎడాపెడా చితకబాదారు. నలుగురూ కలిసి విచక్షణారహితంగా కొట్టారు. కొట్టొద్దని వాలంటీర్ కాళ్లావేళ్లా పడ్డా కనికరించలేదు. ఇష్టం వచ్చినట్టు తలో చోట చేయి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడయాలో వైరల్ కావడంతో తమిళనాడు పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మహాబలిపురానికి ఓ ఫ్యామిలీ కారులో వెళ్లింది. అయితే ఎంట్రీ లేదని కారుని వాలంటీర్ అడ్డుకున్నాడు. అయినా వినకుండా ముందుకెళ్లే ప్రయత్నం చేశాడు కారు డ్రైవర్. దీంతో కారుకు అడ్డుగా వచ్చిన వాలంటీర్పైకి కారు పోనిచ్చాడు. అంతేకాదు ఈ క్రమంలోనే కారు దిగిన ఇద్దరు మహిళలు.. వాలంటీర్పై చేయి చేసుకున్నారు. ఆ తర్వాత మరో ఇద్దరు వాళ్లకి తోడయ్యారు. అంతా కలిసి వీర కుమ్ముడు కుమ్మారు.
వాలంటీర్పై టూరిస్ట్ల దాడి చేసిన దృశ్యాలను అక్కడే ఉన్న మరొకరు సెల్ఫోన్లో చిత్రీకరించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్గా మారింది. ఈ యవ్వారం కాస్తా, పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రభుదాస్, కీర్తన, షణ్ముఖ ప్రియను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..