AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat Sleeper: అద్భుతం.. ఇది రైలా..? విలాసవంతమైన విమానమా..? లోపలి దృశ్యాలు చూశారా..?

దేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలు ఈరోజు శనివారం (జనవరి 17, 2026 ) పట్టాలపై పరుగులు తీయనుంది. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకున్న ఈ రైలు అత్యంత వేగవంతమైనది. అంతే సౌకర్యవంతంగా ఈ రైలును తీర్చిదిద్దారు. 16 కోచ్‌లు కలిగి ఉన్న ఈ రైలులో ఒకేసారి 800 మందికి పైగా ప్రయాణికులు ప్రయాణించవచ్చు.

Vande Bharat Sleeper: అద్భుతం.. ఇది రైలా..? విలాసవంతమైన విమానమా..? లోపలి దృశ్యాలు చూశారా..?
Vande Bharat Sleeper Train
Balaraju Goud
|

Updated on: Jan 17, 2026 | 1:26 PM

Share

దేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలు ఈరోజు శనివారం (జనవరి 17, 2026 ) పట్టాలపై పరుగులు తీయనుంది. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకున్న ఈ రైలు అత్యంత వేగవంతమైనది. అంతే సౌకర్యవంతంగా ఈ రైలును తీర్చిదిద్దారు. 16 కోచ్‌లు కలిగి ఉన్న ఈ రైలులో ఒకేసారి 800 మందికి పైగా ప్రయాణికులు ప్రయాణించవచ్చు. ఇది కేవలం ఒక గంటలో 180 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. లోపలి నుండి అది ఎలా ఉంటుందో చూడటానికి వీడియోను చూడండి. పశ్చిమ బెంగాల్‌లోని మాల్డాలో తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.

నిజానికి, ప్రధాని మోదీ చేతుల మీదుగా తొలి వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభించడం భారతీయ రైల్వే చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని సూచిస్తుంది. ఇప్పటివరకు, వందే భారత్ రైళ్లు చైర్ కార్లను మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చారు. కానీ స్లీపర్ వెర్షన్ పరిచయం సుదూర రాత్రి ప్రయాణాలను మరింత సౌకర్యవంతంగా, వేగవంతం చేస్తుంది. ఈ రైలు ప్రయాణ బడలికలకు ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా రాత్రి ప్రయాణ సమయంలో ఎక్కువ సౌకర్యాన్ని కోరుకునే ప్రయాణీకులకు ఎంతో ఉత్తమం.

రైలు ప్రయాణీకుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన వందే భారత్ స్లీపర్ రైలు లోపలి భాగంలో భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా ఉన్నాయి. ఇవి కోచ్ వాతావరణాన్ని సౌకర్యవంతంగా మాత్రమే కాకుండా ఆకర్షణీయంగా కూడా చేస్తాయి. బెర్తులు, లైటింగ్, కోచ్ లేఅవుట్ సుదూర ప్రయాణాలలో అలసటను తగ్గించడానికి రూపొందించడం జరిగింది. భద్రత కోసం, రైలులో “కవాచ్” ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ అమర్చారు. ఇది సిగ్నల్స్, వేగాన్ని నిరంతరం పర్యవేక్షిస్తుంది. ప్రమాదాలను గణనీయంగా తగ్గిస్తుంది. అదనంగా, అత్యవసర టాక్-బ్యాక్ యూనిట్ అందించారు.ఇది అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణీకులు రైలు సిబ్బందిని నేరుగా సంప్రదించడానికి వీలు కల్పిస్తుంది.

వందే భారత్ స్లీపర్ రైలులో శుభ్రత, పరిశుభ్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కోచ్‌లు UVC- ఆధారిత క్రిమిసంహారక సాంకేతికతతో అమర్చారు. ఇది గాలిలో ఉండే వైరస్‌లు, బ్యాక్టీరియాను నాశనం చేయడంలో సహాయపడుతుంది. ఈ వ్యవస్థ కోచ్ లోపల గాలిని ఫిల్టర్ చేసి శుభ్రపరుస్తుంది. తాజా గాలిని విడుదల చేస్తుంది, ప్రయాణీకులకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందిస్తుంది.

ఈ రైలు వేగం పరంగా కూడా చాలా ప్రత్యేకమైనది. వందే భారత్ స్లీపర్ రైలు గరిష్ట వేగం గంటకు 180 కిలోమీటర్లు. సాధారణ కార్యకలాపాల సమయంలో ఇది గంటకు దాదాపు 130 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. ఈ రైలులో మొత్తం 16 కోచ్‌లు ఉంటాయి. వీటిలో 11 థర్డ్ ఎసి, 4 సెకండ్ ఎసి, ఒక ఫస్ట్ ఎసి కోచ్‌లు ఉంటాయి. ప్రయాణీకులకు ప్రీమియం బెడ్‌రోల్స్, అధిక-నాణ్యత దుప్పట్లు, ప్రయాణ సమయంలో క్యాటరింగ్ వంటి సౌకర్యాలు కూడా లభిస్తాయి. రాజధాని ఎక్స్‌ప్రెస్ వంటి ప్రీమియం రైళ్ల కంటే ఛార్జీలు కొంచెం ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారు.

వీడియో ఇక్కడ చూడండి…

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..