AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP MLC Election Results: యూపీలో ఎన్నిక ఏదైనా బీజేపీదే హవా.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్

ఉత్తరప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లోనూ బీజేపీ తనదైన ముద్ర వేసింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉత్తరప్రదేశ్‌ శాసనమండలి ఎన్నికల్లోనూ బీజేపీ మరోసారి తన సత్తా చాటింది.

UP MLC Election Results: యూపీలో ఎన్నిక ఏదైనా బీజేపీదే హవా.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్
Yogi Adityanath
Balaraju Goud
|

Updated on: Apr 12, 2022 | 3:29 PM

Share

ఉత్తరప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లోనూ బీజేపీ తనదైన ముద్ర వేసింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉత్తరప్రదేశ్‌ శాసనమండలి ఎన్నికల్లోనూ బీజేపీ మరోసారి తన సత్తా చాటింది. యూపీ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లోని లోకల్ అథారిటీ ఏరియాలోని 36 స్థానాల్లో 33 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఈ భారీ విజయంతో ఇప్పుడు యూపీ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో బీజేపీకి పూర్తి మెజారిటీ సొంతం చేసుకుంది. అదే సమయంలో ఈ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీపై స్పష్టమైన అధిక్యతను సంపాదించింది. దీంతో పాటు ముగ్గురు స్వతంత్రులు కూడా విజయం సాధించారు. 36 యూపీ ఎమ్మెల్సీ స్థానాల్లో ఇప్పటికే 9 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో 27 శాసనమండలి స్థానాల్లో 95 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

36 శాసనమండలి స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీకి చెందిన శాసనమండలి సభ్యులు ఇప్పటికే తొమ్మిది స్థానాలకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 27 స్థానాలకు గత శనివారం పోలింగ్ జరిగింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వరుసగా రెండోసారి భారీ మెజార్టీతో గెలుపొందగా, ఇప్పుడు శాసనమండలిలోనూ మెజారిటీ సాధించాలని నిర్ణయించారు. బస్తీ, బారాబంకి, బల్లియా, ఫైజాబాద్ అంబేద్కర్ నగర్, గోండా, సీతాపూర్ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీభారీ విజయంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఈమేరకు యోగి ట్విటర్‌లో పేర్కొన్నారు “ఈ రోజు, ఉత్తరప్రదేశ్ స్థానిక అధికార శాసన మండలి ఎన్నికల్లో బిజెపి సాధించిన భారీ విజయం రాష్ట్ర ప్రజలు జాతీయవాదం, అభివృద్ధి,సుపరిపాలనతో సమర్థ మార్గదర్శకత్వమైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఉన్నారని మళ్లీ స్పష్టం చేసింది.” అంటూ పేర్కొన్నారు.

వారణాసిలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. స్వతంత్ర అభ్యర్థి అన్నపూర్ణ సింగ్ బీజేపీ అభ్యర్థిపై గెలుపొందారు. ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడ బీజేపీ మూడో స్థానంలో నిలిచింది. మాజీ ఎమ్మెల్సీ బ్రిజేష్ సింగ్ భార్య అన్నపూర్ణ సింగ్ వారణాసి నుంచి 4234 ఓట్లతో విజయం సాధించారని వారణాసి జిల్లా మేజిస్ట్రేట్ కౌశల్ రాజ్ శర్మ తెలిపారు. ఆయన తన సమీప ప్రత్యర్థి ఎస్పీకి చెందిన ఉమేష్ యాదవ్‌పై 3889 ఓట్లతో విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి సుదామ పటేల్ 170 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. ఇది కాకుండా 127 బ్యాలెట్లను రద్దు చేశారు. MLC బ్రిజేష్ సింగ్ అన్నయ్య ఉదయ్‌భన్ సింగ్ అలియాస్ చుల్బుల్ సింగ్ 1998లో MLC అయ్యాడు. రెండుసార్లు ఎమ్మెల్సీగా ఎన్నికై పంచాయతీ ఎన్నికల్లో ఆయన ఆధిపత్యం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత 2010లో బ్రిజేష్‌ సింగ్‌ భార్య అన్నపూర్ణ సింగ్‌ బీఎస్పీ టికెట్‌తో ఈ సీటుకు ఎమ్మెల్సీ అయ్యారు. ఆ తర్వాత 2016లో బ్రిజేష్‌ సింగ్‌ రంగంలోకి దిగినప్పుడు బీజేపీ ఆయనకు మద్దతిచ్చి, ఆయనపై అభ్యర్థిని నిలబెట్టలేదు. ఇప్పుడు ఆయన భార్య అన్నపూర్ణ సింగ్, స్వతంత్ర అభ్యర్థి, బీజేపీ ఆటను తిప్పికొట్టి అఖండ విజయం సాధించింది. బస్తీ సిద్ధార్థనగర్ స్థానం నుండి బిజెపి అభ్యర్థి సుభాష్ యాదువంశ్ 4280 ఓట్లతో విజయం సాధించారు. ఆయనకు మొత్తం 5167 ఓట్లు వచ్చాయి. ఎస్పీ అభ్యర్థి సంతోష్ యాదవ్ సన్నీకి 887 ఓట్లు వచ్చాయి. బారాబంకి స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి అంగద్‌ కుమార్‌ సింగ్‌ 1745 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆయనకు 2272 ఓట్లు రాగా, ఆయన సమీప ప్రత్యర్థి ఎస్పీకి చెందిన రాజేష్ యాదవ్‌కు 527 ఓట్లు వచ్చాయి.

రాజా భయ్యా కీర్తి ప్రతాప్‌గఢ్‌లో చెక్కుచెదరకుండా ఉంది. అక్షయ్ ప్రతాప్ సింగ్ 5వ సారి ఎమ్మెల్సీ అయ్యారు. అక్షయ్ ప్రతాప్ సింగ్ 1,106 ఓట్లతో గెలుపొందారు. ఆయనకు మొత్తం 1,720 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి హరి ప్రతాప్‌సింగ్‌కు 614 ఓట్లు వచ్చాయి. ఎస్పీకి చెందిన విజయ్ బహదూర్ యాదవ్ 380 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.అక్షయ్ ప్రతాప్ బాహుబలి నాయకుడు, కుంట ఎమ్మెల్యే రఘురాజ్ ప్రతాప్ సింగ్ అలియాస్ రాజా భయ్యా బంధువు.రాజా భయ్యా మద్దతుతో అక్షయ్ ప్రతాప్ సింగ్ వరుసగా ఐదుసార్లు ప్రతాప్‌గఢ్ స్థానం నుంచి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఎస్పీ టిక్కెట్‌పై మూడుసార్లు ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన.. 2016లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2018లో అఖిలేష్ యాదవ్‌తో రాజా భయ్యా సంబంధాలు చెడిపోవడంతో, అక్షయ్ ప్రతాప్ సింగ్ SP ని వదిలి జనసత్తా పార్టీలో చేరారు. ఇప్పుడు MLC ఎన్నికల్లో భారీ విజయం సాధించారు.

ఆగ్రా ఫిరోజాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి చెందిన విజయ్ శివరే 3,266 ఓట్ల తేడాతో ఎస్పీకి చెందిన దిలీప్ సింగ్‌పై విజయం సాధించారు. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన డాక్టర్ దిలీప్ సింగ్‌కు 205 ఓట్లు వచ్చాయి. మొదటి ప్రాధాన్యత 1,871 ఓట్లు గెలవడానికి అవసరం. మీరట్‌లో బీజేపీకి చెందిన ధర్మేంద్ర భరద్వాజ్‌ విజయం సాధించారు. ధర్మేంద్ర భరద్వాజ్‌కి 3,708 ఓట్లు వచ్చాయి. బ్రిజేష్ సింగ్ ప్రిన్సూ జౌన్‌పూర్‌లో రెండోసారి ఎమ్మెల్సీ అయ్యారు. ఆయనకు 3,130 ఓట్లు వచ్చాయి. మాజీ ఎంపీ ధనంజయ్ సింగ్ సన్నిహితుడు బ్రిజేష్ ఈసారి బీజేపీ తరపున నామినేషన్ వేశారు. అదే సమయంలో ఎస్పీకి చెందిన డాక్టర్ మనోజ్ కుమార్ యాదవ్‌కు మొత్తం 772 ఓట్లు వచ్చాయి.

మాజీ ప్రధాని చంద్రశేఖర్ మనవడు రవిశంకర్ సింగ్ పప్పు విజయం సాధించారు. ఆయనకు 2259 ఓట్లు రాగా, ఎస్పీ అభ్యర్థి అరవింద్ గిరికి 278 ఓట్లు వచ్చాయి. పప్పు వరుసగా నాలుగోసారి విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక ఎస్పీని వీడి బీజేపీలో చేరారు. సీతాపూర్‌లో బీజేపీ అభ్యర్థి పవన్‌కుమార్‌సింగ్‌ భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు 3753 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి ఎస్పీ అరుణేష్ యాదవ్‌కు 61 ఓట్లు మాత్రమే వచ్చాయి.

సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి డాక్టర్ కఫీల్ ఖాన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి డాక్టర్ రతన్‌పాల్ సింగ్‌కు 4255 ఓట్లు వచ్చాయి. సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి డాక్టర్ కఫీల్ ఖాన్ కు 1031 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి డాక్టర్ రతన్ పాల్ సింగ్ 3224 ఓట్లతో విజేతగా నిలిచారు. బహ్రైచ్‌లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ప్రజ్ఞా త్రిపాఠి విజయం సాధించారు. ఎస్పీ అభ్యర్థి అమర్ యాదవ్‌పై ప్రజ్ఞా త్రిపాఠి విజయం సాధించారు. ప్రజ్ఞా త్రిపాఠి 3188 ఓట్లతో గెలుపొందారు. రాయ్‌బరేలీలో బీజేపీ అభ్యర్థి, ఇండిపెండెంట్‌ ఛార్జి మంత్రి దినేష్‌ ప్రతాప్‌సింగ్‌ రెండు వేలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. తన ప్రత్యర్థి, సమాజ్‌వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడు వీరేంద్ర యాదవ్‌పై ఆయన విజయం సాధించారు.

, ఫైజాబాద్ అంబేద్కర్ నగర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి హరి ఓం పాండే తన సమీప ప్రత్యర్థి ఎస్పీకి చెందిన హీరాలాల్ యాదవ్‌పై 1680 ఓట్ల తేడాతో విజయం సాధించారు. పాండేకు 2724 ఓట్లు రాగా, యాదవ్‌కు 1044 ఓట్లు వచ్చాయి. గోండా బల్‌రామ్‌పూర్ స్థానంలో బీజేపీ అభ్యర్థి అవధేష్ కుమార్ సింగ్ విజయం సాధించారు. జిల్లా మేజిస్ట్రేట్ ఉజ్వల్ కుమార్ మాట్లాడుతూ సింగ్ తన సమీప ప్రత్యర్థి ఎస్పీకి చెందిన భాను త్రిపాఠిపై 4401 ఓట్లతో విజయం సాధించారు. ఎస్పీ అభ్యర్థికి 171 ఓట్లు మాత్రమే వచ్చాయి.

Read Also…  Bank Alert: HDFC యూజర్లకు షాక్.. UPI చెల్లింపులకు పరిమితి పెట్టిన బ్యాంక్.. పూర్తి వివరాలు..

ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...