Meerut: వీళ్లతో పోలిస్తే పశువులు కూడా సిగ్గుపడతాయ్.. మహిళా టీచర్ను లైంగికంగా వేధించిన స్టూడెంట్స్
కీచకుల్లా మారిన కొందరు ఉపాధ్యాయులు విద్యార్థినులను లైంగికంగా వేధించిన సంఘటనలు విన్నాం చూశాం. కానీ ఏకంగా మహిళా టీచర్ని క్లాస్రూమ్లోనే విద్యార్థులు లైంగికంగా వేధించిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
క్లాస్రూమ్లోనే ముగ్గురు విద్యార్థులు బరితెగించారు. కీచకుడి వారసుల్లా మారిన స్టూడెంట్స్ మహిళా టీచర్ని లైంగిక వేధింపులకు గురిచేశారు. ఆ తర్వాత మరింత రెచ్చిపోయి టీచర్పై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ పైశాచిక ఆనందం పొందారు. అంతటితో ఆగక తమ వికృత వికార లైంగిక వేధింపులను వీడియో కూడా తీశారు. అది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ షాకింగ్ సంఘటన ఉత్తర్ప్రదేశ్లో చోటు చేసుకుంది.
మీరట్ లోని ఓ స్కూల్లో ముగ్గురు మైనర్ విద్యార్థులు తమకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్న మహిళా టీచర్ పట్ల బుద్ధి లేకుండా పశువుల్లా ప్రవర్తించారు. క్లాస్రూమ్లో టీచర్ ఎదుట అసభ్య చేష్టలకు పాల్పడ్డారు. వెకిలి మాటలు, వెకిలి చేష్టలతో కామ పిశాచాల్లా వ్యవహరించారు. క్లాస్రూమ్లోనే టీచర్కు అసభ్యకరంగా సైగలు చేస్తూ రెచ్చిపోయారు. అంతటితో ఆగని ఆ నీచులు మేడమ్, ఐ లవ్ యూ అంటూ డైరెక్టుగా క్లాస్రూమ్లోనే టీచర్పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. క్లాస్రూమ్ బయటకు వెళ్లిన తర్వాత కూడా టీచర్ వెంట పడ్డ ముగ్గురు ఆకతాయి విద్యార్థులు అక్కడ కూడా లవ్ యూ మేడం, ఓసారి చూడండి మేడం అంటూ టీచర్ను అత్యంత దారుణంగా వేధించారు. కొంతమంది విద్యార్థినులు కూడా ఈ కామ పిశాచాల అల్లరిని చూసి ముసిముసి నవ్వులు నవ్వుకోవడం మరో విషాదం.
ఆ టీచర్ మొదట వాళ్ల వెకిలి చేష్టలను, అసభ్య వ్యాఖ్యలను పట్టించుకోలేదు. ఇది తప్పు, చట్టవిరుద్ధమని చెబుతూ విద్యార్థులను మందలించి వాళ్లకు బుద్ధి వచ్చేలా చేసేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ వాళ్లు వెకిలి కామెంట్లు, చేష్టలు మానకపోవడంతో సహనం కోల్పోయిన ఆమె క్లాస్రూమ్ నుంచి వెళ్లిపోయారు. అప్పుడు కూడా ఆ ముగ్గురు విద్యార్థులు ఆమెను వెంబడించి వేధించారు. సహనం కోల్పోయిన ఆ టీచర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముగ్గురు మైనర్ విద్యార్థులు తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని మహిళా టీచర్ కంప్లయింట్ ఇచ్చారు. తనను వేధించిన ఒక విద్యార్థి సోదరి పేరును కూడా ఆమె కంప్లయింట్లో ప్రస్తావించారు. పోలీసులు ఆ మైనర్ విద్యార్థులపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై మీరట్ ఎస్పీకేశవ్కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు మైనర్లు కావడంతో ఆయా సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. కీచకుల్లా మారిన కొందరు ఉపాధ్యాయులు విద్యార్థినులను లైంగికంగా వేధించిన సంఘటనలు విన్నాం చూశాం. కానీ ఏకంగా మహిళా టీచర్ని క్లాస్రూమ్లోనే విద్యార్థులు లైంగికంగా వేధించిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం