అన్ లాక్ గైడ్ లైన్స్ పాలసీ ఫైన్, మాయావతి కితాబు

అన్ లాక్ 4.0 గైడ్ లైన్స్ పాలసీ ఏకీకృతంగా, చాలా బాగుందని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ప్రశంసించారు. ఇది ఏ రాజకీయ పార్టీకీ, వ్యక్తులకూ అతీతంగా, సర్వ జన సమ్మతంగా ఉందని..

అన్ లాక్ గైడ్ లైన్స్ పాలసీ ఫైన్, మాయావతి కితాబు

Edited By:

Updated on: Aug 30, 2020 | 5:09 PM

అన్ లాక్ 4.0 గైడ్ లైన్స్ పాలసీ ఏకీకృతంగా, చాలా బాగుందని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ప్రశంసించారు. ఇది ఏ రాజకీయ పార్టీకీ, వ్యక్తులకూ అతీతంగా, సర్వ జన సమ్మతంగా ఉందని ఆమె ఆదివారం పేర్కొన్నారు. దేశంలో ఈ పాలసీ ప్రకారం, మెట్రో రైళ్లను సెప్టెంబర్ 7  నుంచి నడపాలని అనుకుంటున్నారని, అలాగే రాజకీయ, సామాజిక, మతపరమైన సభలు, సమావేశాలను సెప్టెంబరు 21 నుంచి అనుమతించాలని హోమ్ శాఖ తీసుకున్న నిర్ణయం సబబే అని ఆమె వ్యాఖ్యానించారు. అలాగే  స్కూళ్ళు, కాలేజీలను సెప్టెంబరు 30 వరకు మూసి ఉంచాలని, తొమ్మిది నుంచి 12 వ తరగతి వరకు విద్యార్థులకు కొన్ని సడలింపులతో తరగతులు నిర్వహించాలని  చేసిన ప్రతిపాదన సహేతుకంగా ఉందని మాయావతి అభిప్రాయపడ్డారు.

కేవలం కొన్ని పార్టీల స్వార్థపర ప్రయోజనాలను ఈ పాలసీలో పక్కనపెట్టారని ఆమె పేర్కొన్నారు. ఒక విధంగా బీజేపీ విధానాన్ని ఆమె సమర్థించినట్టు కనిపిస్తోంది.

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us