Road Accident: బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. పాదచారుల పైకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఏడుగురు చిన్నారుల దుర్మరణం

|

Nov 20, 2022 | 10:48 PM

మహనార్-హాజీపూర్ ప్రధాన రహదారిలోని దేశరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. సుల్తాన్‌పూర్ లో జరిగిన ఓ వివాహ వేడుక విందులో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అదుపు తప్పి ట్రక్కు జనాలపైకి వెళ్లిపోయింది. సంఘటనా స్థలంలోనే 7 గురు చనిపోయారు.

Road Accident: బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. పాదచారుల పైకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఏడుగురు చిన్నారుల దుర్మరణం
Road Accident
Follow us on

బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై అదుపుతప్పిన ఓ ట్రక్కు పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. వైశాలి జిల్లా దేశరి పోలీస్ స్టేషన్ పరిధిలోని సుల్తాన్‌పూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని సమాచారం. మహనార్-హాజీపూర్ ప్రధాన రహదారిలోని దేశరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. సుల్తాన్‌పూర్ లో జరిగిన ఓ వివాహ వేడుక విందులో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అదుపు తప్పి ట్రక్కు జనాలపైకి వెళ్లిపోయింది. సంఘటనా స్థలంలోనే 7 గురు చనిపోయారు. అదే సమయంలో ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. క్షతగాత్రులను ట్రక్కు కింద నుంచి బయటకు తీశారు. స్థానికుల సహకారంతో పోలీసులు వారిని. జిల్లా ఆస్పత్రికి తరలించారు.  కాగా ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.