Bank Robbery: అర్ధరాత్రి బ్యాంకులో చొరబడిన దొంగలు.. చిల్లర మొత్తం ఊడ్చేశారు.. ఏం జరిగిందంటే..

| Edited By: Anil kumar poka

Jan 02, 2023 | 6:45 PM

డిసెంబర్ 29 అర్ధరాత్రి దాటిన తర్వాత దోపిడీ దొంగలు తెగబడ్డారు. బ్యాంకులో చొరబడిన దొంగలు చిల్లర మొత్తం ఊడ్చుకెళ్లారు.

Bank Robbery: అర్ధరాత్రి బ్యాంకులో చొరబడిన దొంగలు.. చిల్లర మొత్తం ఊడ్చేశారు.. ఏం జరిగిందంటే..
Bank Robbery
Follow us on

డిసెంబర్ 29 అర్ధరాత్రి దాటిన తర్వాత దోపిడీ దొంగలు తెగబడ్డారు. బ్యాంకులో చొరబడిన దొంగలు చిల్లర మొత్తం ఊడ్చుకెళ్లారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలిసింది.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర పాల్ఘర్‌లో డిసెంబర్ 29 మరియు 30 మధ్య రాత్రి మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో బ్యాంకులోకి చొరబడి రూ.2లక్షల నాణేలను దొంగిలించిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి ఆదివారం తెలిపారు.

బోయిసర్‌లోని జాతీయ బ్యాంకుకు చెందిన బ్రాంచ్‌లో కిటికీకి ఉన్న ఇనుప గ్రిల్‌ను తొలగించారు. ఆ తర్వాత స్ట్రాంగ్‌రూమ్‌లోకి వెళ్లేందుకు ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను తొలగించిన దొంగలు చోరీకి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

రూ.2లక్షల విలువైన నాణేల బస్తాలను దొంగిలించారని, వారిని సల్వాద్‌-శివాజీనగర్‌ ప్రాంతంలో అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. దోచుకున్న మొత్తంలో రూ.1.80లక్షలు రికవరీ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.