AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గోవులు తరలిస్తున్నారని ముగ్గురు హత్య.. బీహార్‌లో దారుణం

బీహార్‌లో దారుణం జరిగింది. సరాన్ జిల్లా చాప్రా ప్రాంతంలోని బనియాపూర్ దగ్గర మూకహత్యలు కలకలం రేపాయి. గోవులను అపహరణకు యత్నించిన వారిపై అనుమానంతో ముగ్గురు వ్యక్తులను స్థానికులు కొట్టి చంపారు. గ్రామంలోకి గోవులను ఎత్తుకెళ్లేందుకు నలుగురు వచ్చారని.. అయితే అందులో ఒకరు తప్పించుకోగా.. మరో ముగ్గురు పట్టుబడ్డారని స్థానికులు తెలిపారు. అయితే గోవులను తరలిస్తున్న వారిని కొందరు స్ధానికులు చితకబాదారు.. ఈవిషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. దీంతో మృతుల బంధువులు ధర్నా చేపట్టారు. […]

గోవులు తరలిస్తున్నారని ముగ్గురు హత్య.. బీహార్‌లో దారుణం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 20, 2019 | 7:05 AM

Share

బీహార్‌లో దారుణం జరిగింది. సరాన్ జిల్లా చాప్రా ప్రాంతంలోని బనియాపూర్ దగ్గర మూకహత్యలు కలకలం రేపాయి. గోవులను అపహరణకు యత్నించిన వారిపై అనుమానంతో ముగ్గురు వ్యక్తులను స్థానికులు కొట్టి చంపారు. గ్రామంలోకి గోవులను ఎత్తుకెళ్లేందుకు నలుగురు వచ్చారని.. అయితే అందులో ఒకరు తప్పించుకోగా.. మరో ముగ్గురు పట్టుబడ్డారని స్థానికులు తెలిపారు. అయితే గోవులను తరలిస్తున్న వారిని కొందరు స్ధానికులు చితకబాదారు.. ఈవిషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. దీంతో మృతుల బంధువులు ధర్నా చేపట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. ఆందోళనకు దిగారు. పోలీసుల నిర్లక్ష్యంతోనే ముగ్గురి హత్యలు జరిగాయని ఆరోపించారు.