Kulgam Encounter: జమ్మూలోని కుల్గాంలో భారీ ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం..

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు.

Kulgam Encounter: జమ్మూలోని కుల్గాంలో భారీ ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం..
Kashmir Encounter

Updated on: May 08, 2022 | 6:46 PM

Jammu Kashmir Encounter: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా.. జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో జరిగిన భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ క్రమంలో భద్రతా బలగాల ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్ కుల్గాం జిల్లాలోని చెయాన్ దేవ్‌సర్ ప్రాంతంలో ఆదివారం ఆదివారం జరిగింది. ఇంకా ఈ ప్రాంతంలో సోదాలు కొనసాగుతున్నాయని.. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

ఉగ్రవాదుల ఉనికి సమాచారంతో చెయాన్‌ దేవ్‌సర్‌ ప్రాంతంలో భద్రతా బలగాలు సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో బలగాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. బలగాలు సైతం దాడులను తిప్పికొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని.. వారిలో ఒకరు పాకిస్థాన్ ఉగ్రవాది హైదర్‌గా గుర్తించినట్లు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ) విజయ్ కుమార్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

హైదర్‌ రెండేళ్లుగా ఉత్తర కశ్మీర్‌లో యాక్టివ్‌గా ఉన్నాడని, అనేక ఉగ్రవాద నేరాల్లో నిందితుడిగా ఉన్నాడని తెలిపారు. ఒకరు లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాద సంస్థకు చెందినవాడని విజయ్ కుమార్ తెలిపారు.

Also Read :

Telangana: కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం.. ఏడుగురి పరిస్థితి విషమం..

Al Qaeda Chief: మరోసారి భారత్‌పై విషం చిమ్మిన అల్‌ఖైదా అధినేత అమాన్‌ అల్‌ జవహిరీ!