కల్తీమద్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని మక్కల్ నీది మయం (ఎంఎన్ఎం) అధినేత కమల్హాసన్ అన్నారు. ఆదివారం కళ్లకురిచ్చి కల్తీ మద్యం తాగి చికిత్స పొందుతున్న వారిని ఆయన పరామర్శించారు. అక్కడ రోగులతో మాట్లాడారు. వారికి అందుతున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మద్యం తాగిన విషయంలో బాధితులు అజాగ్రత్తగా వహించారని అన్నారు. వారి ఆరోగ్యంపై అధికారులు శ్రద్ద వహించాల్సిన అవసరం ఉందన్నారు. మద్యం తాగిన వారు కూడా వారి స్థాయికి మంచి తాగారని వ్యాఖ్యానించారు. బాధితులకు కౌన్సెలింగ్ ఇచ్చే కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విన్నవించారు. కల్తీ మద్యం విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
కాగా, రాష్ట్రంలోని కళ్లకురిచి హూచ్ కల్తీ మద్యం తాగి చాలా మంది మృతి చెందారు. జూన్ 19న జరిగిన ఈ ఘటనలో ఆదివారం నాటికి మృతుల సంఖ్య 56కు చేరింది. అయితే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే నాలుగు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి ఇంకా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో ప్రమేయమున్న ఏడుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
#WATCH | Tamil Nadu: After meeting the Hooch tragedy victims, MNM party chief Kamal Haasan says, “…These victims will have to understand they have exceeded their limit and they have been careless. They have to be careful. They have to take care of their health. My request to… pic.twitter.com/qrci9g8OFs
— ANI (@ANI) June 23, 2024
తమిళనాడులోని కళ్లకురిచి హూచ్ ట్రాజెడీ కేసుకు సంబంధించి, కల్తీ మద్యం తాగి 216 మంది అస్వస్థతకు గురయ్యారని, వారిని తమిళనాడులోని నాలుగు ఆసుపత్రులలో చేర్చారని పోలీసులు తెలిపారు. పుదుచ్చేరిలోని జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లో చేరిన ముగ్గురు రోగులు ఇప్పటివరకు మరణించారు. కళ్లకురిచి హూచ్ ట్రాజెడీ మెడికల్ కాలేజీలో అత్యధిక మరణాలు సంభవించాయి. ఇక్కడ ఇప్పటివరకు 31 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది కాకుండా సేలం మెడికల్ కాలేజీలో చేరిన 18 మంది మరణించారు. అలాగే మృతుల కుటుంబీకులకు రూ.10 లక్షలు, చికిత్స పొందుతున్న వారికి రూ.50వేల ఎక్స్గ్రేషియా ప్రకటించారు తమిళనాడు సీఎం.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి