తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ముఖ్యమంత్రి విజయ్ నిర్ణయం..!

తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత సి. జోసెఫ్ విజయ్, లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (LTTE) వ్యవస్థాపకుడు వేలుపిళ్లై ప్రభాకరన్ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించడం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. 2009లో శ్రీలంక సైన్యం చేతిలో ప్రభాకరన్ హతమైన ముల్లివైక్కల్ విషాదాన్ని స్మరిస్తూ, తమిళుల హక్కుల కోసం తన గళాన్ని వినిపించారు. ముల్లివైక్కల్ జ్ఞాపకాలతో భావోద్వేగ సందేశం ఇచ్చారు.

తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న  ముఖ్యమంత్రి విజయ్ నిర్ణయం..!
Vijay Pays Tribute To Ltte Prabhakaran

Updated on: May 19, 2026 | 11:00 AM

తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత సి. జోసెఫ్ విజయ్, లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (LTTE) వ్యవస్థాపకుడు వేలుపిళ్లై ప్రభాకరన్ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించడం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. 2009లో శ్రీలంక సైన్యం చేతిలో ప్రభాకరన్ హతమైన ముల్లివైక్కల్ విషాదాన్ని స్మరిస్తూ, తమిళుల హక్కుల కోసం తన గళాన్ని వినిపించారు. ముల్లివైక్కల్ జ్ఞాపకాలతో భావోద్వేగ సందేశం ఇచ్చారు.

శ్రీలంక అంతర్యుద్ధం ముగిసిన ముల్లివైక్కల్ ప్రాంతాన్ని ప్రస్తావిస్తూ విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. “ముల్లివైక్కల్ జ్ఞాపకాలను మనం మన హృదయాల్లో పదిలపరుచుకుంటాము! సముద్రం అవతల నివసిస్తున్న మన తమిళ బంధువుల హక్కుల కోసం మనం ఎల్లప్పుడూ సంఘీభావంతో నిలబడతాము” అని ఆయన పేర్కొన్నారు. కేవలం భావోద్వేగంగానే కాకుండా, రాజకీయంగా కూడా ఈలం తమిళుల సమస్యపై తన వైఖరిని ఆయన స్పష్టం చేశారు.

సాధారణంగా తమిళనాడులో అధికారంలో ఉన్న పార్టీలు LTTEకి ప్రత్యక్షంగా మద్దతు తెలపడానికి వెనుకాడుతుంటాయి. ముఖ్యంగా 1991లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రభాకరన్ ప్రధాన నిందితుడిగా ఉండటం, భారత్‌లో LTTEపై నిషేధం కొనసాగుతుండటం ఇందుకు ప్రధాన కారణం. అయితే, విజయ్ మాత్రం సెప్టెంబర్ 2025లో నాగపట్టినం ప్రసంగంలోనూ ప్రభాకరన్‌ను ఉద్దేశించి మాతృ ప్రేమను చూపిన నాయకుడు అని అభివర్ణించారు.

ప్రస్తుతం విజయ్ నేతృత్వంలోని మైనారిటీ ప్రభుత్వానికి LTTE అనుకూల వైఖరి కలిగిన విడుతలై చిరుతైగల్ కట్చి (VCK) మద్దతు ఇస్తోంది. మరోవైపు, విజయ్ ముఖ్యమంత్రిగా తనదైన శైలిని చాటుకుంటున్నారు. రజనీకాంత్, కమల్ హాసన్ వంటి దిగ్గజాలు సైతం విజయ్ రాజకీయ ప్రస్థానంపై స్పందిస్తూ, ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతుండటం గమనార్హం.

ఇదిలావుంటే, ముల్లివైక్కల్ స్మరణ దినం అనేది కేవలం ఒక చారిత్రక ఘట్టం మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులకు అన్యాయంపై పోరాడే ఒక స్ఫూర్తిగా నిలుస్తోంది. 30 ఏళ్ల పాటు సాగిన ఈ సాయుధ పోరాటం ముగిసినా, తమిళుల హక్కుల పోరాటం మాత్రం నేటికీ రాజకీయాల్లో కీలక అంశంగానే మిగిలి ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us