పూర్తి అధికారం వారిదే.. ఆన్‌లైన్ బెట్టింగ్‌ గేమ్స్ నిషేధంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ఆన్‌లైన్ బెట్టింగ్, జూదం నియంత్రణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. డబ్బు పందెంతో ఆడే ఆన్‌లైన్ గేమ్‌లను నిషేధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని స్పష్టం చేసింది. నైపుణ్యానికి సంబంధించిన ఆటలైనా, వాటిపై డబ్బు పందేలు కాస్తే అవి ‘బెట్టింగ్, గ్యాంబ్లింగ్’ పరిధిలోకే వస్తాయని పేర్కొంది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు తీసుకొచ్చిన ఆన్‌లైన్ గేమింగ్ నిషేధ చట్టాలను సమర్థిస్తూ, బెట్టింగ్ లేదా గ్యాంబ్లింగ్ నిర్వహించడం మౌలిక హక్కు కాదని తేల్చిచెప్పింది.

పూర్తి అధికారం వారిదే.. ఆన్‌లైన్ బెట్టింగ్‌ గేమ్స్ నిషేధంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Online Betting Games

Edited By:

Updated on: Jun 03, 2026 | 7:00 PM

ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ వ్యవహారంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆన్‌లైన్ బెట్టింగ్‌ గేమ్స్ నిషేధంపై రాష్ట్రాలకు పూర్తి అధికారం ఉంటుందని స్పష్టం చేసింది. నైపుణ్యం అవసరమయ్యే ఆటలైనా, డబ్బు పందెం కాస్తే అది జూదం కిందకే వస్తుందని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు ఆన్‌లైన్ బెట్టింగ్‌ ఆటలను నిషేధించే రాష్ట్ర ప్రభుత్వాల చట్టాలను సమర్థించింది. రాజ్యాంగం ప్రకారం బెట్టింగ్, జూదం అంశాలపై చట్టాలు చేసే సర్వాధికారాలు రాష్ట్రాలకు ఉన్నాయని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ఆన్‌లైన్ బెట్టింగ్‌లను నిషేధించడానికి చేసిన చట్టాలు పూర్తిగా చెల్లుతాయని స్పష్టం చేసింది. ఆన్‌లైన్ జూదాలను నిషేధించే పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉందని జస్టిస్ జె.బి. పార్దివాలా, జస్టిస్ ఆర్. మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

బెట్టింగ్ మౌలిక హక్కు కాదు..

బెట్టింగ్ వ్యాపారం చేయడం ఎవరికీ మౌలిక హక్కు కాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఇది ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకులు, గేమింగ్ కంపెనీలకు తీవ్రమైన ఎదురుదెబ్బ. ఆన్‌లైన్ రమ్మీ, పోకర్ వంటి యాప్‌లలో డబ్బులు పందెంగా పెట్టడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. గతంలో మద్రాస్ హైకోర్టు, కర్ణాటక హైకోర్టులు రాష్ట్ర ప్రభుత్వాల నిషేధ చట్టాలను కొట్టివేసిన తీర్పులను సుప్రీంకోర్టు పక్కనపెట్టింది. ఆట ఆడటానికి నైపుణ్యం అవసరమైనప్పటికీ, దానిపై డబ్బుల పందేలు కాస్తే అది జూదం కిందకే వస్తుంది అని ధర్మాసనం అభిప్రాయపడింది.

యువతపై ప్రభావం

ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనాల వల్ల యువత అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న సామాజిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు, సమాజ హితం, శాంతి భద్రతల దృష్ట్యా ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లపై నిషేధం విధించడం సరైన చర్య అని రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలను సమర్థించింది. ఈ తీర్పుతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను నిషేధించడానికి మార్గం సుగమమైంది. ఇకపై రాష్ట్రాలు తమ సొంత చట్టాల ద్వారా ఆన్‌లైన్ జూదం, బెట్టింగ్‌ను కట్టడి చేయడం సులభం అవుతుందని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us