‘నాలుగు ప్రశ్నలకు సమాధానమివ్వండి నిర్మలాజీ ‘! కాంగ్రెస్

| Edited By: Pardhasaradhi Peri

Apr 29, 2020 | 5:26 PM

బ్యాంకులకు కుచ్ఛు టోపీ పెట్టి రుణాలు ఎగగొట్టిన 50 మంది డీఫాల్టర్లలో బీజేపీ మిత్రులు ఉన్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించడం, దానికి ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ 13 ట్వీట్లతో కౌంటరివ్వడం తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ వివాదాన్ని ఇంతటితో వదలడంలేదు. తాము అడుగుతున్న నాలుగు ప్రశ్నలకు సింపుల్ గా సమాధానాలు ఇవ్వాలని ఈ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా మళ్ళీ బీజేపీని, ఆర్ధిక శాఖ మంత్రిని నిలదీశారు. ఫైనాన్స్ వంటి […]

నాలుగు ప్రశ్నలకు సమాధానమివ్వండి నిర్మలాజీ ! కాంగ్రెస్
Follow us on

బ్యాంకులకు కుచ్ఛు టోపీ పెట్టి రుణాలు ఎగగొట్టిన 50 మంది డీఫాల్టర్లలో బీజేపీ మిత్రులు ఉన్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించడం, దానికి ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ 13 ట్వీట్లతో కౌంటరివ్వడం తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ వివాదాన్ని ఇంతటితో వదలడంలేదు. తాము అడుగుతున్న నాలుగు ప్రశ్నలకు సింపుల్ గా సమాధానాలు ఇవ్వాలని ఈ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా మళ్ళీ బీజేపీని, ఆర్ధిక శాఖ మంత్రిని నిలదీశారు. ఫైనాన్స్ వంటి ఉన్నత శాఖకు మంత్రి పదవిలో ఉన్న మీరే సమస్యను తప్పుదారి పట్టిస్తున్నారని, ఇది సరికాదని ఆయన ట్వీట్ చేశారు.

నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ. విజయ్ మాల్యా.. ఈ ముగ్గురి నుంచి స్వాధీనం చేసుకున్నట్టు చెబుతున్న సొమ్ముకు ఎంతో వ్యత్యాసం ఉందని ఆయన అన్నారు. వీరి నుంచి 2,780.50 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు మీరు ట్వీట్ చేశారని, అయితే 2002 మార్చి 16 న పార్లమెంటుకు సంబంధిత మంత్రి ఇఛ్చిన సమాధానంలో.. ఈడీ,… ఫెమా, పీఎంఎల్ఎ చట్టాల కింద ఐదేళ్లలో కేవలం 96.93 కోట్లు మాత్రమే స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారని ఆయన గుర్తు చేస్తూ… ఇందుకు సంబంధించిన న్యూస్ కటింగ్ ను కూడా తన ట్వీట్ కి జత చేశారు. అసలు 2014..15….2019..20 మధ్య కాలంలో మోదీ ప్రభుత్వం 6,66,000 కోట్ల బ్యాంక్ రుణాలను ఎందుకు మాఫీ చేసిందని రణదీప్ సూర్జేవాలా ప్రశ్నించారు. ఈ నెల 24 న రిజర్వ్ బ్యాంకు ఆర్టీఐ కి ఇఛ్చిన రిప్లయ్ లో రూ.. 68,607 కోట్ల రుణాలను మాఫీ చేసినట్టు తెలిపింది. ఇది నిజమా? కాదా ? నీరవ్ మోదీ, మెహుల్  చోక్సీ , జతిన్ మెహతా, విజయ్ మాల్యాతో సహా మరికొందరి డీఫాల్టర్ల రుణాలను ప్రభుత్వం ఎందుకు మాఫీ చేసింది ? ఇందుకు ఎవరు అనుమతించారు ? అని సూర్జేవాలా సూటిగా ప్రశ్నించారు. వీటికి సమాధానాలు ఇవ్వాలని కోరారు.