AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra Politics: ఇంటికా.. జైలుకా.. మరాఠాలకు గవర్నర్ క్షమాపణలు చెప్పాలని ఉద్దవ్ డిమాండ్..

క్షమాపణలు చెప్పాలని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేశారు. ఆయనను ఇంటికి తిరిగి పంపించాలా లేదా జైలుకు పంపాలా అని నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.

Maharashtra Politics: ఇంటికా.. జైలుకా.. మరాఠాలకు గవర్నర్  క్షమాపణలు చెప్పాలని ఉద్దవ్ డిమాండ్..
Uddhav Thackeray
Sanjay Kasula
|

Updated on: Jul 30, 2022 | 4:57 PM

Share

మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ(Bhagat Singh Koshyari) ముంబైపై చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని శివసేన(Shiv Sena) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే(Uddhav Thackeray )డిమాండ్ చేశారు. ఆయనను ఇంటికి తిరిగి పంపించాలా లేదా జైలుకు పంపాలా అని నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ముంబైలోని(Mumbai) తన నివాసం ‘మాతోశ్రీ’లో విలేకరుల సమావేశంలో థాకరే మాట్లాడుతూ..”గవర్నర్ మరాఠీ ప్రజలపై తన మనస్సులో ఉన్న ద్వేషం అనుకోకుండా బయటపడిందని అన్నారు. మరాఠీ ప్రజలకు గవర్నర్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

కోశ్యారీని ఇంటికి పంపాలా లేక జైలుకు పంపాలా అని నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.. గత మూడేళ్లలో మహారాష్ట్రలో ఉంటూ మరాఠీ మాట్లాడే వారిని అవమానించారని, ఇప్పుడు ఈ వ్యాఖ్యలతో ఆయన గవర్నర్‌ పదవికి అగౌరవం తెచ్చారని థాకరే ఆరోపించారు. ముంబై, థానేలలో శాంతియుతంగా జీవిస్తున్న హిందువులను గవర్నర్‌ ధ్రువీకరించారని థాకరే ఆరోపించారు.

గుజరాతీలు, రాజస్థానీలు మహారాష్ట్రను విడిచి వెళ్లితే.. ఈ రాష్ట్రంలో డబ్బేం మిగలదంటూ గవర్నర్ కోష్యారీ వ్యాఖ్యానించారు. శుక్రవారం సాయంత్రం ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో కోష్యారీ మాట్లాడుతూ, ముంబైలో డబ్బు మిగిలి ఉండదని, గుజరాతీలు, రాజస్థానీలు నగరంలో లేకపోతే అది దేశ ఆర్థిక రాజధానిగా నిలిచిపోతుందని అన్నారు.

ఇదే అంశంపై తాజాగా ఆయన వివరణ ఇచ్చారు. తాను మరాఠీలను తక్కువ అంచనా వేయాలనే ఉద్దేశం తనకు లేదన్నారు. గుజరాతీ, రాజస్తానీలు అందించిన సహకారంపై మాత్రమే తాను మాట్లాడానని అన్నారు. మరాఠీలు ఎంతో కష్టపడి మహారాష్ట్రను నిర్మించారు. ఎందరో మరాఠీ పారిశ్రామికవేత్తలు ప్రసిద్ధి చెందారు. ముంబై నగరం మహారాష్ట్రకు గర్వకారణమని స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..