Accident: ఆంధ్రప్రదేశ్​- బెంగళూరు జాతీయ రహదారిపై ఘోరం.. లారీ – జీప్ ఢీ కొని ఏడుగురు దుర్మరణం

|

Sep 12, 2021 | 9:53 PM

కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిక్‌బళ్లాపూర్‌ దగ్గర లారీ-జీపు ఢీ కొన్నాయి. ఈ దుర్ఘటనలో జీపు నుజ్జునుజ్జయింది. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

Accident: ఆంధ్రప్రదేశ్​- బెంగళూరు జాతీయ రహదారిపై ఘోరం.. లారీ - జీప్ ఢీ కొని ఏడుగురు దుర్మరణం
Karnataka Accident
Follow us on

Karnataka road accident: కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిక్‌బళ్లాపూర్‌ దగ్గర లారీ-జీపు ఢీ కొన్నాయి. ఈ దుర్ఘటనలో జీపు నుజ్జునుజ్జయింది. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. లారీ-జీపు ఢీ కొన్న ప్రదేశం హృదయ విదారకంగా మారింది. మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. రోదనలతో ఆ ప్రాంతం విషాదంలో మునిగిపోయింది. గాయపడ్డవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

చిక్కబళ్లాపుర్​లోని చింతామని తాలుకాలో ఆంధ్రప్రదేశ్​- బెంగలూరు జాతీయ రహదారిపై మదికేరే క్రాస్​వద్ద ఈ ప్రమాదం జరిగింది. శ్రీనివాసపుర్​ తాలుకాలోని రాయల్​పాడు గ్రామం నుంచి జీపు చింతామనికి వైపునకు వస్తున్న క్రమంలో లారీని ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఘటనాస్థలంలోనే ఆరుగురు మృతి చెందగా.. ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గం మధ్యలో ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు.

Read also: Talasani Srinivas Yadav: పెద్దమనసుతో ఈసారికి మినహాయింపు ఇవ్వాలి.. మంత్రి తలసాని విజ్ఞప్తి