మరో ఉగ్రస్థావరం గుట్టురట్టు

| Edited By:

Jun 04, 2020 | 7:10 PM

దేశ వ్యాప్తంగా అంతా ఓ వైపు కరోనాతో యుద్ధం చేస్తుంటే.. మరోవైపు మన భారత జవాన్లు మాత్రం ఓ వైపు కరోనాతో మరోవైపు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులతో యుద్ధం చేస్తున్నారు.

మరో ఉగ్రస్థావరం గుట్టురట్టు
Follow us on

దేశ వ్యాప్తంగా అంతా ఓ వైపు కరోనాతో యుద్ధం చేస్తుంటే.. మరోవైపు మన భారత జవాన్లు మాత్రం ఓ వైపు కరోనాతో మరోవైపు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులతో యుద్ధం చేస్తున్నారు. గత రెండు నెలలుగా నిత్యం జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులతో సైన్యం యుద్ధం చేస్తోంది. ఈ క్రమంలో ఉగ్రవాదుల రహస్య స్థావరాలను గుర్తించి.. వారి కదలికలకు చెక్ పెడుతోంది. తాజాగా జమ్ముకశ్మీర్‌లోని కిష్టావర్‌ జిల్లాలో మరో ఉగ్రస్థావరాన్ని సైన్యం గుర్తించింది. స్థానిక పోలీసులతో కలిసి భారత ఆర్మీ కూంబింగ్ చేపడుతున్న సమయంలో.. ఈ ఉగ్రస్థావరాన్ని కనిపెట్టారు. అక్కడి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలతో పాటు.. మందు గుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కిష్టావర్ జిల్లాలోని ఓ అటవీ ప్రాంతంలో ఈ స్థావరం బయటపడింది. 9ఎంఎం పిస్టల్‌తో  పాటు పదుల సంఖ్యలో బుల్లెట్లు, గ్రేనేడ్స్‌ను కూడా గుర్తించారు.