కోవిడ్ పాండమిక్ పై ఆర్ ఎస్ ఎస్ చీఫ్ తో బాటు పలువురు ప్రముఖుల ప్రసంగాలు, 4 రోజుల సుదీర్ఘ టీవీ కార్యక్రమం

| Edited By: Phani CH

May 09, 2021 | 11:40 AM

దేశంలో కోవిడ్ పాండమిక్ పై ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో బాటు పలువురు ప్రముఖులు ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. మే 11 నుంచి మే 14 వరకు ..నాలుగు రోజులపాటు వీరంతా టీవీ ద్వారా ప్రసంగిస్తారు.

కోవిడ్ పాండమిక్ పై ఆర్ ఎస్ ఎస్ చీఫ్ తో బాటు పలువురు ప్రముఖుల ప్రసంగాలు, 4 రోజుల సుదీర్ఘ టీవీ కార్యక్రమం
Mohan Bhagwat
Follow us on

దేశంలో కోవిడ్ పాండమిక్ పై ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో బాటు పలువురు ప్రముఖులు ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. మే 11 నుంచి మే 14 వరకు ..నాలుగు రోజులపాటు వీరంతా టీవీ ద్వారా ప్రసంగిస్తారు. విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్ జీ, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్ సుధా మూర్తి, తదితరులు ‘పాజిటివిటీ అన్ లిమిటెడ్’ అనే కార్యక్రమంలో పాల్గొంటారు. చివరి రోజున ఎలెక్ట్రానిక్ మీడియాను ఉద్దేశించి మోహన్ భగవత్ ప్రసంగిస్తారని ఈ సంస్థ వెల్లడించింది. ఇంకా సద్గురు జగ్జీ వాసుదేవ్, శ్రీశ్రీశ్రీ రవిశంకర్, నిర్మల్ సంత్ అఖారా నుంచి జ్ఞాన్ దేవ్ జీ, తిరపంథి జైన్ సమాజ్ నుంచి జైన్ ముని ప్రాణనాథ్, తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారని పేర్కొంది. ప్రతి రోజూ ఇద్దరు సుమారు 15 నిముషాలపాటు టీవీలో ప్రసంగిస్తారని ఈ కోవిడ్ సంక్షోభ సమయంలో ప్రజలు ఎలా సమైక్యంగా ఉండాలో, ఈ మహమ్మారిపై జరిపే పోరులో ఎలా విజయం సాధించాలో వివరిస్తారని ఆర్ ఎస్ ఎస్ కు చెందిన కోవిడ్ రెస్పాన్స్ టీమ్ కన్వీనర్ రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ గుర్ మీత్ సింగ్ తెలిపారు. ప్రజల్లో నైతిక సామర్త్యాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. సమాజం లోని వివిధ వర్గాలకు చెందిన స్టేక్ హోల్డర్లతో ఇలా విశిష్ట ప్రోగ్రాం ని చేపట్టామని ఆర్ ఎస్ ఎస్ ప్రతినిధి అధికార ప్రతినిధి వెల్లడించారు. ఫిక్కి, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, తమ సంస్థకు చెందిన సేవా భారతి, బాబా రామ్ దేవ్ నేతృత్వంలోని పతంజలి యోగా పీఠ్ కూడా ఇందుకు సహకరిస్తున్నాయన్నారు.
ఇప్పటికే తమ సంస్థ సుమారు 500 బెడ్లతో ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసిందని, హాస్పిటలైజేషన్ కోసం వేచి ఉన్న రోగులకు తాత్కాలిక ఆక్సిజన్ సప్లయ్ కి తగిన సదుపాయాలు కల్పించిందని ఈ సంస్థ వెల్లడించింది. 803 ప్లాస్మా డొనేషన్స్ ని, 1300 సిటి స్కాన్లను ఏర్పాటు చేయడమేగాక మృత రోగుల అంత్యక్రియలకు 2619 క్రిమేషన్స్ ని కూడా నిర్వహిస్తున్నట్టు పేర్కొంది. 1200 మంది వాలంటీర్లు, 130 మంది డాక్టర్లతో హెల్ప్ లైన్ ని కూడా నిర్వహిస్తున్నామని, ఇప్పటివరకు ఈ హెల్ప్ లైన్ కి 88000 కాల్స్ అందాయని వెల్లడించింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral News: విచిత్ర‌మైన ప్రేమ క‌థ‌.. ఈమె ప్రియుడు ప‌క్క‌న ఉన్నంత‌సేపు శున‌కంలా జీవిస్తుంది

కరోనా డబుల్ మ్యూటేషన్‌లో మళ్లీ కొత్త వేరియేషన్..! ఇప్పుడు మునపటి కంటే చాలా డేంజర్ : సీసీఎంబీ