గంజాయ్ స్మగ్లర్ చేతిలో దారుణ హత్యకు గురైన టీవీ రిపోర్టర్
తమిళనాట దారుణం జరిగింది. గంజాయ్ స్మగ్లర్ల చేతిలో తమిళన్ టీవీ ఛానల్కి చెందిన రిపోర్టర్ మౌనస్ దారుణ హత్యకు గురయ్యారు.

Reporter death Tamil Nadu: తమిళనాట దారుణం జరిగింది. గంజాయ్ స్మగ్లర్ల చేతిలో తమిళన్ టీవీ ఛానల్కి చెందిన రిపోర్టర్ మౌనస్ దారుణ హత్యకు గురయ్యారు. అతడితో మాట్లాడాలని, కాంచీపురంలోని పుండ్రత్తూర్లోని ఓ ఇంటికి రమ్మని చెప్పిన గంజాయ్ స్మగ్లర్లు దారుణంగా హతమార్చారు. మౌసస్ ఒంటిపై 18చోట్ల కత్తితో పొడిచి చంపేశారు. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. (చాలా గర్వంగా ఉంది.. ఆయన ఙ్ఞాపకాలతో బ్రతికేస్తా: అమర జవాన్ ప్రవీణ్ రెడ్డి భార్య)
కాగా ఇటీవల స్మగ్లింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారుల భూకబ్జాలపై మౌనస్ స్టింగ్ ఆపరేషన్ చేశారు. వాటికి సంబంధించిన వరుస కథనాలను ఇటీవల ప్రసారం చేశారు. ఈ క్రమంలో మాట్లాడాలని రమ్మని చెప్పిన స్మగ్లర్లు అతడిని చంపేశారు. ఇంకెవరైనా జర్నలిస్ట్ స్మగ్లింగ్ వార్తలు రాస్తే ఇదే గతి అంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతోంది. ( Flash: మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్)