AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫేస్‌ టు ఫేస్ తేల్చుకోవడమే : కేంద్ర మంత్రి రాజ్‌నాథ్

మనల్ని బాధపెట్టాలని ఎవరైనా చూస్తే వారి అంతు తేల్చకుండా వదిలిపెట్టమన్నారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్. పాకిస్థాన్ మరో ఉగ్రదాడికి పాల్పడే అవకాశాలున్నాయని, తీర ప్రాంతం గుండా ప్రవేశించి ఈ దాడులు జరిపే వీలుందన్నారు రాజ్‌నాథ్. అయితే మన రక్షణ వ్యవస్థ అత్యంత శక్తిమంతమైందని ప్రతి విధమైన ఉగ్రదాడుల్ని తిప్పికొట్టగల సత్తా మనకు ఉందన్నారు రాజ్‌నాథ్. కేరళలో కొల్లాంలో జరిగిన మాతా అమృతానందమయి దేవి పుట్టిన రోజు వేడుల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో అశాంతిని […]

ఫేస్‌ టు ఫేస్ తేల్చుకోవడమే  : కేంద్ర మంత్రి రాజ్‌నాథ్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 28, 2019 | 2:35 AM

Share

మనల్ని బాధపెట్టాలని ఎవరైనా చూస్తే వారి అంతు తేల్చకుండా వదిలిపెట్టమన్నారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్. పాకిస్థాన్ మరో ఉగ్రదాడికి పాల్పడే అవకాశాలున్నాయని, తీర ప్రాంతం గుండా ప్రవేశించి ఈ దాడులు జరిపే వీలుందన్నారు రాజ్‌నాథ్. అయితే మన రక్షణ వ్యవస్థ అత్యంత శక్తిమంతమైందని ప్రతి విధమైన ఉగ్రదాడుల్ని తిప్పికొట్టగల సత్తా మనకు ఉందన్నారు రాజ్‌నాథ్. కేరళలో కొల్లాంలో జరిగిన మాతా అమృతానందమయి దేవి పుట్టిన రోజు వేడుల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో అశాంతిని రేపేందుకు శత్రువులు అనేక పన్నాగాలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. జమ్ము కశ్మీర్‌లో దారుణమైన పుల్వామా ఘటనలో 40 మంది సైనికులు వీరమరణం పొందారన్నారు. దేశం కోసం ప్రాణాలను అర్పించిన వారి త్యాగాలను ఎన్నటికీ మర్చిపోకూడదన్నారు రక్షణ మంత్రి. తాను హోం మంత్రిగా ఉన్నప్పుడే పుల్వామా దారుణం జరిగిందని, దానికి ప్రతిగానే బాలాకోట్‌లో వాయుసేన జరిపిందని తెలిపారు.

ఐక్యరాజ్య సమితిలో కశ్మీర్ విషయంపై  భారత్, పాక్‌లు రెండు తమ వాదన వినిపించిన సంగతి తెలిసిందే. మన దేశం శాంతి కోరుకుంటుందని ఉగ్రవాదం అంతానికి ప్రపంచదేశాలు అన్నీ ఒక్కతాటిపైకి రావాలని ప్రధాని మోదీ ప్రసంగించారు. అయితే కశ్మీర్ విషయంలో అన్ని దారులు మూసుకుపోయిన నిర్వేదంలో ఉన్న పాక్ మాత్రం ఓటమిని అంగీకరించలేని దశలో ఉంది. పైగా భారత్‌తో పోరాటానికి సైతం వెనుకాడబోమంటూ ప్రకటించారు ఆదేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్. ఇదిలా ఉంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా యుద్ధం అనివార్యమైతే భారత్ అందుకు తగిన విధంగా రెడీగా ఉంది అనేలా శుక్రవారం రక్షణ మంత్రి రాజ్‌నాధ్ చేసిన వ్యాఖ్యలున్నాయి.