జమ్మూ కశ్మీర్‌.. లోయలో పడ్డ ఆర్మీ వాహనం! ముగ్గురు జవాన్లు మృతి

జమ్మూ కశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు సైనికులు మృతి చెందారు. శ్రీనగర్ వెళుతున్న సైనిక వాహనం లోయలో పడిపోయింది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ప్రమాదం జరగడం కలవరాన్ని నింపింది. ప్రస్తుతం రక్షణ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.

జమ్మూ కశ్మీర్‌.. లోయలో పడ్డ ఆర్మీ వాహనం! ముగ్గురు జవాన్లు మృతి
Indian Army Vehicles

Updated on: May 04, 2025 | 1:56 PM

జమ్మూ కశ్మీర్‌లోని రాంభన్‌ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జమ్మూ నుంచి శ్రీనగర్‌ వెళ్తుండగా ఆర్మీ వాహనం లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత భారత్‌, పాక్‌ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తల మధ్య సైన్యం దాడికి సిద్ధం అవుతున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Loading...
Unable to load recommendations.
Follow Us