Rahul Gandhi: నా నుంచి బీజేపీ అన్ని లాక్కోవచ్చు.. కానీ వాయనాడ్ ప్రజల నుంచి వేరు చేయలేరు..

లోకసభ ఎంపీగా అనర్హత వేటు పడిన తరువాత తొలిసారి గతంలో తానను తాను ప్రాతినిధ్యం వహించిన వయనాడుకు వచ్చారు రాహుల్‌గాంధీ. ప్రియాంకాగాంధీ కూడా వయనాడులో రాహుల్‌తో కలిసి రోడ్‌షో నిర్వహించారు.

Rahul Gandhi: నా నుంచి బీజేపీ అన్ని లాక్కోవచ్చు.. కానీ వాయనాడ్ ప్రజల నుంచి వేరు చేయలేరు..
Rahul Gandhi

Updated on: Apr 11, 2023 | 6:35 PM

మంగళవారం (ఏప్రిల్ 11) వయనాడ్‌లో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బిజెపిపై విరుచుకుపడ్డారు. నా ఇంటిని 50 సార్లు తీసుకోండి, నేను వాయనాడ్, భారతదేశ ప్రజల సమస్యను లేవనెత్తుతాను. నాలుగేళ్ల క్రితం ఇక్కడికి వచ్చి మీ ఎంపీని అయ్యాను. నాకు ప్రచారం భిన్నమైన ప్రచారం. నా ఇంటికి పోలీసులను పంపించి లేదా నా ఇంటిని తీసుకొని నన్ను భయపెడతారని వారు భావిస్తున్నారు.. కాని వారు నా ఇంటిని తీసుకున్నందుకు నేను సంతోషిస్తున్నాను అని అన్నారు రాహుల్ గాంధీ.

ఎంపీ అనేది కేవలం ట్యాగ్ మాత్రమేనని రాహుల్ గాంధీ వివరణ ఇచ్చారు. ఇది ఒక పోస్ట్ కాబట్టి బిజెపి ట్యాగ్‌ని తొలగించవచ్చు.. వారు నా పదవిని తీసుకోవచ్చు.. వారు ఇల్లు తీసుకోవచ్చు, నన్ను జైలులో కూడా పెట్టవచ్చు, కాని వారు నన్ను వాయనాడ్ ప్రజలకు ప్రాతినిధ్యం వహించకుండా ఆపలేరని అన్నారు.

అదానీతో తనకున్న సంబంధాన్ని వివరించేందుకు ఒక పారిశ్రామికవేత్త గురించి పార్లమెంటులో నేను ప్రధాని మోదీని ఒక ప్రశ్న అడిగాను. మొదటిసారిగా ప్రభుత్వమే పార్లమెంట్‌ను నడపనివ్వడం లేదన్నారు రాహుల్ గాంధీ.

అనర్హత వేటు పడిన తర్వాత తొలిసారి వాయనాడ్‌లో రాహుల్

లోకసభ ఎంపీగా అనర్హత వేటు పడిన తరువాత తొలిసారి గతంలో తానను తాను ప్రాతినిధ్యం వహించిన వయనాడుకు వచ్చారు రాహుల్‌గాంధీ. ప్రియాంకాగాంధీ కూడా వయనాడులో రాహుల్‌తో కలిసి రోడ్‌షో నిర్వహించారు. పరువునష్టం దావా కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడడంతో ఆయనపై లోక్‌సభ సెక్రటేరియట్‌ అనర్హత వేటు వేసింది.

సత్యమేవ జయతే పేరుతో రాహుల్‌గాంధీ వయనాడు లోని కాయపేటలో రోడ్‌షో నిర్వహించారు. రోడ్‌షో భారీ సంఖ్యలో కాంగ్రెస్‌ కార్యకర్తలు హాజరయ్యారు. యూడీఎఫ్‌ నేతలు కూడా రాహుల్‌కు సంఘీభావం ప్రకటించారు. తనపై తప్పుడు కేసు పెట్టారని రాహుల్‌ అంటున్నారు. చివరకు సత్యమే గెలుస్తుందని స్పష్టం చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం