Purvanchal Expressway Inauguration: ప్రశ్నిస్తున్న వారికి పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేనే సమాధానం.. ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ..

పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ప్రారంభించారు. లక్నో నుంచి ఉత్తరప్రదేశ్ రాజధాని ఘాజీపూర్ వరకు 340.8 కిలోమీటర్ల పొడవైన..

Purvanchal Expressway Inauguration: ప్రశ్నిస్తున్న వారికి పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేనే సమాధానం.. ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ..
Purvanchal Expressway Inaug

Updated on: Nov 16, 2021 | 2:46 PM

పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ప్రారంభించారు. లక్నో నుంచి ఉత్తరప్రదేశ్ రాజధాని ఘాజీపూర్ వరకు 340.8 కిలోమీటర్ల పొడవైన ఈ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారు. ఎక్స్‌ప్రెస్‌వేపై 3.2 కిలోమీటర్ల ఎయిర్ స్ట్రిప్ కూడా తయారు చేయబడింది. ఎయిర్‌స్ట్రిప్ వద్ద గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రధానికి స్వాగతం పలికారు. యుద్ధ విమానాలను అత్యవసరంగా ల్యాండింగ్ చేసేందుకు వీలుగా ఎక్స్‌ప్రెస్‌వేపై 3.2 కిలోమీటర్ల ఎయిర్‌స్ట్రిప్ నిర్మించబడింది. 341 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్‌వే రాష్ట్ర రాజధాని లక్నోను ఘాజీపూర్‌తో కలుపుతుంది. రూ. 22,500 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించబడింది. ఎయిర్‌స్ట్రిప్ వేదిక నుండి ప్రధాని వివిధ విమానాల ద్వారా ఎయిర్ షోను తిలకించారు.

రాష్ట్ర రాజధాని లక్నోను ఘాజీపూర్‌తో కలుపుతూ ఈ ఎక్స్‌ప్రెస్‌వే 341-కిమీ పొడవు ఉంది. 22,500 కోట్ల అంచనా వ్యయంతో దీన్ని నిర్మించారు.

341 కిలోమీటర్ల పొడవైన పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే చౌదసరాయ్ గ్రామం నుండి ప్రారంభమవుతుంది. లక్నో జిల్లా లక్నో-సుల్తాన్‌పూర్ రహదారి (NH-731)లో ఉంది.


ఉత్తరప్రదేశ్-బీహార్ సరిహద్దుకు తూర్పున 18 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి నంబర్ 31పై ఉన్న హైదరియా గ్రామం వద్ద ముగుస్తుంది. ఎక్స్‌ప్రెస్‌వే 6-లేన్‌ల వెడల్పుతో భవిష్యత్తులో 8-లేన్‌లకు విస్తరించబడుతుంది.

ఇది కూడా చదవండి: AP MPTC And ZPTC Elections 2021 Live: ఏపీలో కొనసాగుతున్న ప్రాదేశిక ఎన్నికలు.. మందకొడిగా పోలింగ్‌..