టీఎంసీ నేతలకు రాష్ట్రపతి భవన్ షాక్.. అపాయింట్‌మెంట్‌ ఇచ్చేందుకు నిరాకరణ!

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలవాలనుకున్న తృణమూల్‌ నేతలకు చుక్కెదురైంది. రాష్ట్రపతి బిజీ షెడ్యూల్ కారణంగా గురువారం (మార్చి 12)న అపాయింట్‌మెంట్ ఇచ్చేందుకు రాష్ట్రపతి కార్యాలయం నిరాకరించింది. బెంగాల్ ఆదివాసీలకు అందుతున్న సంక్షేమ పథకాలను రాష్ట్రపతికి వివరించేందుకు 12 మంది సభ్యులతో కూడిన తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం కలవాలనుకుంది.

టీఎంసీ నేతలకు రాష్ట్రపతి భవన్ షాక్.. అపాయింట్‌మెంట్‌ ఇచ్చేందుకు నిరాకరణ!
President Droupadi Murmu, Mamata Banerjee

Updated on: Mar 13, 2026 | 12:58 PM

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలవాలనుకున్న తృణమూల్‌ నేతలకు చుక్కెదురైంది. రాష్ట్రపతి బిజీ షెడ్యూల్ కారణంగా గురువారం (మార్చి 12)న అపాయింట్‌మెంట్ ఇచ్చేందుకు రాష్ట్రపతి కార్యాలయం నిరాకరించింది. బెంగాల్ ఆదివాసీలకు అందుతున్న సంక్షేమ పథకాలను రాష్ట్రపతికి వివరించేందుకు 12 మంది సభ్యులతో కూడిన తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం కలవాలనుకుంది. కానీ రాష్ట్రపతి భవన్ బిజీ షెడ్యూల్‌ను పేర్కొంటూ సమయం ఇవ్వడానికి నిరాకరించింది. అయితే, వచ్చే వారం అయినా రాష్ట్రపతిని కలిసేందుకు అవకాశం ఇవ్వాలని ఆ బృందం మరో లేఖను పంపించినట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పశ్చిమ బెంగాల్ పర్యటన సందర్భంగా ప్రొటోకాల్‌ ఉల్లంఘన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్రపతి ముర్ము స్వయంగా అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇటీవలి సిలిగురి వివాదం చుట్టూ ఉన్న అపార్థాలను పరిష్కరించుకోవడానికి TMC ప్రతినిధి బృందం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు. TMC రాష్ట్రపతితో సమావేశం కావాలని అభ్యర్థించింది. కానీ రాష్ట్రపతికి సమయం లేదని రాష్ట్రపతి భవన్ స్పందించింది. అప్పటి నుండి TMC వచ్చే వారం పార్టీ ఎంపీలతో సమావేశం కావాలని రాష్ట్రపతిని సూచించింది.

మార్చి 7వ తేదీన 9వ అంతర్జాతీయ సంతాల్ సదస్సులో ప్రసంగించడానికి రాష్ట్రపతి బెంగాల్‌లోని సిలిగుడికి వెళ్లారు. అయితే, బాగ్డోగ్రా విమానాశ్రయంలో ఆహ్వానం పలికేందుకు బెంగాల్ మంత్రులు ఎవరూ లేకపోవడం పట్ల ద్రౌపది ముర్ము అసంతృప్తి వ్యక్తం చేశారు. సిలిగురి సమీపంలో తన కార్యక్రమం వేదిక మార్పుపై కూడా ముర్ము అసంతృప్తి వ్యక్తం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us