PM Narendra Modi: ఆ పార్టీలది విష రాజకీయం.. వారి ఉచ్చులో పడకండి: ప్రధాని మోడీ

014 తర్వాత కేంద్ర ప్రభుత్వ పాలనపై ప్రజలకు మరింత విశ్వాసం పెరిగిందంటూ వ్యాఖ్యానించారు. జైపూర్‌లో జరిగిన బీజేపీ జాతీయ ఆఫీస్ బేరర్ల సమావేశంలో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు.

PM Narendra Modi: ఆ పార్టీలది విష రాజకీయం.. వారి ఉచ్చులో పడకండి: ప్రధాని మోడీ
Pm Modi

Updated on: May 20, 2022 | 1:39 PM

PM Modi Speech: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిపక్ష పార్టీలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ పార్టీలది విష రాజకీయమని.. వారి ఉచ్చులో పడకండి అంటూ ప్రధాని మోడీ.. బీజేపీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఎ ప్రభుత్వం ఎనిమిదేళ్లపాటు దేశ సమతుల్య అభివృద్ధి, సామాజిక న్యాయం, సామాజిక భద్రతకు అంకితమైందని మోడీ పేర్కొన్నారు. 2014 తర్వాత కేంద్ర ప్రభుత్వ పాలనపై ప్రజలకు మరింత విశ్వాసం పెరిగిందంటూ వ్యాఖ్యానించారు. జైపూర్‌లో జరిగిన బీజేపీ జాతీయ ఆఫీస్ బేరర్ల సమావేశంలో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పేద, అర్హులైన లబ్ధిదారులకు అవగాహన కల్పించాలి.. దీనికోసం అన్ని చోట్ల ప్రచారం ప్రారంభించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు.

ఈ నెలతో ఎన్‌డీఏ ప్రభుత్వం ఎనిమిదేళ్లు పూర్తి చేసుకోనుందని, ఈ ఎనిమిదేళ్లు తీర్మానాలు, విజయాలతో గడిచిపోయాయని మోడీ పేర్కొన్నారు. ఈ ఎనిమిదేళ్లు సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేశామని.. అదే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు.

చిన్న రైతులు, కూలీలు, మధ్యతరగతి ప్రజల ఆశలు ఎనిమిదేళ్లలో నెరవేరాయని ప్రధాని మోదీ అన్నారు. ఈ ఎనిమిదేళ్లు దేశ సమతౌల్య అభివృద్ధి, సామాజిక న్యాయం, సామాజిక భద్రతకు సంబంధించినవని.. ఈ ఎనిమిదేళ్లు తల్లులు, కుమార్తెలు, సోదరీమణుల సాధికారత కోసం అంకితభావంతో పని చేశామన్నారు.

ఇవి కూడా చదవండి

2014 తర్వాత బీజేపీ ప్రభుత్వం.. పాలన పరంగా, వ్యవస్థల పనితీరుపై గతంలో కోల్పోయిన విశ్వాసాన్ని పునరుద్ధరించిందని ప్రధాని స్పష్టంచేశారు. తీసుకొచ్చిన సంస్కరణలు, చేపట్టిన అభివృద్ధితో ప్రపంచం మొత్తం నేడు భారత్‌ వైపు చూస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

భారత్‌లో కూడా బీజేపీ అంటే ప్రజలకు ప్రత్యేక అభిమానం ఉందని మోడీ పేర్కొన్నారు. దేశ ప్రజలు బీజేపీని ఎంతో విశ్వాసంతో, ఆశతో చూస్తున్నారని అన్నారు. 2014 తర్వాత బీజేపీ ప్రజలను నిరాశా నిస్పృహల నుంచి బయటకు తీసుకొచ్చిందని, నేడు ప్రజలు నెరవేరిన ఆకాంక్షలను చూస్తున్నారని ప్రధాని అన్నారు.

దేశ ప్రజల ఈ ఆశలు, ఆకాంక్షలు మన బాధ్యతను మరింతగా పెంచుతున్నాయని బీజేపీ కార్యవర్గ సభ్యులతో మోడీ పేర్కొన్నారు.75వ స్వాతంత్య్ర సంవత్సరంలో.. దేశం రాబోయే 25 ఏళ్ల లక్ష్యాలను నిర్దేశిస్తోందని మోడీ పేర్కొన్నారు. రాబోయే 25 ఏళ్ల లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటి కోసం నిరంతరం శ్రమించాల్సిన సమయం బీజేపీకి ఉందని ఆయన పేర్కొన్నారు.

కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం విషం చిమ్మేందుకు చిన్నచిన్న ఉద్రిక్తతలను వెతుక్కుంటూ ఉంటాయని.. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. మోడీ ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించారు.

దేశాభివృద్ధి లాంటి అంశాల నుంచి తప్పుదోవ పట్టించే విధంగా.. కొన్ని ప్రయత్నాలు జరుగుతాయని.. అలాంటి విష రాజకీయాల ఉచ్చులో పడొద్దని ప్రధాని మోడీ బీజేపీ నేతలు, కార్యకర్తలకు సూచించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us