
భారత ప్రధానమంత్రి మోదీ రూ. 62,000 కోట్లకు పైగా విలువైన యువత-కేంద్రీకృత కార్యక్రమాలను ఆవిష్కరించారు. ప్రధానమంత్రి రూ. 60,000 కోట్ల పెట్టుబడితో కేంద్ర ప్రాయోజిత పథకం అయిన PM-SETU అడ్వాన్స్డ్ ఐటీఐల ద్వారా ప్రధానమంత్రి నైపుణ్యం, ఉపాధి పరివర్తనను ప్రారంభించారు. ఈ పథకం కింద, దేశవ్యాప్తంగా 1,000 ప్రభుత్వ ఐటీఐలను 200 హబ్ ఐటీఐలు, 800 స్పోక్ ఐటీఐలతో కూడిన హబ్-అండ్-స్పోక్ మోడల్గా అప్గ్రేడ్ చేస్తారు. ప్రతి హబ్ సగటున నాలుగు స్పోక్లకు అనుసంధానించి, అధునాతన మౌలిక సదుపాయాలు, ఆధునిక ట్రేడ్లు, డిజిటల్ లెర్నింగ్ సిస్టమ్లు, ఇంక్యుబేటర్ సౌకర్యాలతో కూడిన క్లస్టర్లను ఏర్పాటు చేస్తారు.
ప్రధాన మంత్రి మోదీ బీహార్లో ముఖ్యమంత్రి నిశ్చయ్ స్వయం సహాయ భత్య పథకాన్ని కూడా ప్రారంభించారు. దీని కింద ఐదు లక్షల మంది గ్రాడ్యుయేట్లకు రెండేళ్లపాటు నెలకు రూ. 1,000 భత్యం అందించడం జరుగుతుంది. పరిశ్రమ ఆధారిత కోర్సులు, వృత్తి విద్యను ప్రోత్సహించడానికి బీహార్లోని జన్ నాయక్ కర్పురి ఠాకూర్ నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని ప్రధాన మంత్రి ప్రారంభించారు. బీహార్లోని నాలుగు విశ్వవిద్యాలయాలలో కొత్త విద్య, పరిశోధన సౌకర్యాలకు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. బీహార్లో NIT పాట్నా కొత్త క్యాంపస్ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు.
యువత కోసం వివిధ పథకాలను ప్రారంభిస్తూ, ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతూ, గత పదేళ్లలో తమ ప్రభుత్వం 4000 ఐటీఐలను ఆధునీకరించిందని ప్రధాని మోదీ తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్పై యువత ఫోకస్ పెట్టాలన్నారు. యువతకు ఎంతో శక్తి ఉందని, దేశాభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. జీఎస్టీ సంస్కరణల లాభాలు కూడా బిహార్ యువతకే ఎక్కువగా అందుతున్నాయన్నారు. “గత రెండు దశాబ్దాలలో, బీహార్ ప్రభుత్వం 50 లక్షల మంది యువతను ఉపాధితో అనుసంధానించింది. బీహార్ యువతకు దాదాపు 10 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వబడ్డాయి” అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..